Political News

సుప్రింకోర్టు చేతులు దులిపేసుకుందా ?

రాజధానుల వివాదాన్ని వాయిదా వేయటం ద్వారా సుప్రింకోర్టు చేతులు దులిపేసుకున్నట్లుంది. అత్యవసరంగా విచారించాలని ప్రభుత్వం ఎంత విజ్ఞప్తిచేసినా ధర్మాసనం పట్టించుకోలేదు. ప్రభుత్వ వాదనలు తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేపేరుతో కేసు విచారణను ఏప్రిల్ కు కోర్టు వాయిదావేసింది. కేసు విచారణను ఏప్రిల్ కు వాయిదా అంటేనే కోర్టు మనోగతం అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే మూడురాజధానులను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి.

ఇదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి జేఏసీ పేర్లతో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తర్వాత సుప్రింకోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. బుధవారం మూడు రాజధానుల కేసుపై సుప్రింకోర్టులో విచారణ జరిగింది. అత్యవసరం దృష్ట్యా మూడు రాజధానుల వ్యవహారంపై వెంటనే విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం వాదించింది. అయితే ప్రభుత్వం వాదనను విన్న జడ్జీలు ప్రతివాదులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ వాదనను కూడా వినాలన్నారు. ప్రతివాదుల వాదనను వినాలన్న కారణంతో తర్వాత విచారణను ఏప్రిల్ కు వాయిదా వేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసి కూడా సుప్రింకోర్టు కేసును ఏప్రిల్ కు ఎందుకు వాయిదా వేసినట్లు ? ఎందుకంటే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులా ? లేకపోతే చంద్రబాబు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్లు అమరావతే ఏకైక రాజధానా అన్న విషయం తొందరలో జరగబోయే ఎన్నికలతో ముడిపడుంది.

జగన్ మళ్ళీ గెలిస్తే మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అలాకాకుండా వైసీపీ ఓడిపోతే మూడు రాజధానుల ప్రతిపాదన వీగిపోవటం ఖాయం. మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది. దాంతో అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుంది. అప్పుడు కోర్టు తీర్పుతో సంబంధంలేకుండా అమరావతి మాత్రమే రాజధానిగా మిగిలిపోతుంది. సో, ఈ విషయాలను గమనించిన తర్వాతనే సుప్రింకోర్టు రాజధాని వివాదాన్ని ఏప్రిల్ కు వాయిదావేసినట్లు అర్ధమవుతోంది.

This post was last modified on January 4, 2024 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

47 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago