Political News

సుప్రింకోర్టు చేతులు దులిపేసుకుందా ?

రాజధానుల వివాదాన్ని వాయిదా వేయటం ద్వారా సుప్రింకోర్టు చేతులు దులిపేసుకున్నట్లుంది. అత్యవసరంగా విచారించాలని ప్రభుత్వం ఎంత విజ్ఞప్తిచేసినా ధర్మాసనం పట్టించుకోలేదు. ప్రభుత్వ వాదనలు తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేపేరుతో కేసు విచారణను ఏప్రిల్ కు కోర్టు వాయిదావేసింది. కేసు విచారణను ఏప్రిల్ కు వాయిదా అంటేనే కోర్టు మనోగతం అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే మూడురాజధానులను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి.

ఇదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి జేఏసీ పేర్లతో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తర్వాత సుప్రింకోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. బుధవారం మూడు రాజధానుల కేసుపై సుప్రింకోర్టులో విచారణ జరిగింది. అత్యవసరం దృష్ట్యా మూడు రాజధానుల వ్యవహారంపై వెంటనే విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం వాదించింది. అయితే ప్రభుత్వం వాదనను విన్న జడ్జీలు ప్రతివాదులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ వాదనను కూడా వినాలన్నారు. ప్రతివాదుల వాదనను వినాలన్న కారణంతో తర్వాత విచారణను ఏప్రిల్ కు వాయిదా వేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసి కూడా సుప్రింకోర్టు కేసును ఏప్రిల్ కు ఎందుకు వాయిదా వేసినట్లు ? ఎందుకంటే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులా ? లేకపోతే చంద్రబాబు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్లు అమరావతే ఏకైక రాజధానా అన్న విషయం తొందరలో జరగబోయే ఎన్నికలతో ముడిపడుంది.

జగన్ మళ్ళీ గెలిస్తే మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అలాకాకుండా వైసీపీ ఓడిపోతే మూడు రాజధానుల ప్రతిపాదన వీగిపోవటం ఖాయం. మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది. దాంతో అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుంది. అప్పుడు కోర్టు తీర్పుతో సంబంధంలేకుండా అమరావతి మాత్రమే రాజధానిగా మిగిలిపోతుంది. సో, ఈ విషయాలను గమనించిన తర్వాతనే సుప్రింకోర్టు రాజధాని వివాదాన్ని ఏప్రిల్ కు వాయిదావేసినట్లు అర్ధమవుతోంది.

This post was last modified on January 4, 2024 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిన్మయి vs ట్విట్టర్ యువత – ఆగేదెప్పుడు?

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…

14 minutes ago

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

38 minutes ago

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

53 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

59 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

1 hour ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

1 hour ago