వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను మారుస్తూ సీఎం జగన్ నిన్న రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు సర్దుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు నేతలు పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును విజయవాడ వెస్ట్ కు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. అయితే, ఈ నిర్ణయంతో సంతృప్తిగా లేని మల్లాది విష్ణు సైలెంట్ గా ఉన్నారు. దీంతో, ఆయనను కలిసేందుకు వెల్లంపల్లి స్వయంగా మల్లాది విష్ణు ఇంటికి వెళ్లారు. అయితే, వెల్లంపల్లితో ముక్తసరిగా విష్ణు మాట్లాడడంతో ఆ భేటీ 15 నిమిషాల పాటే సాగింది. దీంతో, వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
షర్మిల వెంట నడిచేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నట్టుగా బెజవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు తన అనుచరులు, కార్పొరేటర్లతో మల్లాది విష్ణు పలుమార్లు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పిన విష్ణుకు…వైసీపీ అధిష్టానం నుంచి స్పందన సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఆల్రెడీ వైఎస్ షర్మిల తో విష్ణు టచ్ లో ఉన్నారని, తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఇక, తాజాగా విష్ణు తో మాట్లాడేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో వైసీపీకి విష్ణు గుడ్ బై చెప్పేసినట్లేనని టాక్ వస్తోంది.
This post was last modified on January 3, 2024 11:03 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…