వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను మారుస్తూ సీఎం జగన్ నిన్న రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు సర్దుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు నేతలు పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును విజయవాడ వెస్ట్ కు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. అయితే, ఈ నిర్ణయంతో సంతృప్తిగా లేని మల్లాది విష్ణు సైలెంట్ గా ఉన్నారు. దీంతో, ఆయనను కలిసేందుకు వెల్లంపల్లి స్వయంగా మల్లాది విష్ణు ఇంటికి వెళ్లారు. అయితే, వెల్లంపల్లితో ముక్తసరిగా విష్ణు మాట్లాడడంతో ఆ భేటీ 15 నిమిషాల పాటే సాగింది. దీంతో, వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
షర్మిల వెంట నడిచేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నట్టుగా బెజవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు తన అనుచరులు, కార్పొరేటర్లతో మల్లాది విష్ణు పలుమార్లు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పిన విష్ణుకు…వైసీపీ అధిష్టానం నుంచి స్పందన సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఆల్రెడీ వైఎస్ షర్మిల తో విష్ణు టచ్ లో ఉన్నారని, తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఇక, తాజాగా విష్ణు తో మాట్లాడేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో వైసీపీకి విష్ణు గుడ్ బై చెప్పేసినట్లేనని టాక్ వస్తోంది.
This post was last modified on January 3, 2024 11:03 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…