Political News

నారా ఫ్యామిలి ఫుల్లు బిజీనా ?

ఒక్కసారిగా నారా ఫ్యామిలి ఫుల్లు బిజీ అయిపోయింది. బహిరంగసభలతో చంద్రబాబునాయుడు, నియోజకవర్గం పర్యటనతో లోకేష్, నిజం గెలవాలని పరామర్శయాత్రతో భువనేశ్వరి యాక్టివ్ అయిపోయారు. ఈనెల 5వ తేదీనుండి 29వ తేదీవరకు వరుసగా చంద్రబాబు బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు. అంటే 24 రోజుల్లో 25 బహిరంగసభల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. మధ్యలో ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అందుకనే ఒకేరోజు రెండు మూడు బహిరంగసభలను కూడా ప్లాన్ చేశారు. ఏరోజు ఎక్కడ బహిరంగ సభలను నిర్వహించబోతున్న విషయాన్ని ఇప్పటికే తమ్ముళ్ళకు షెడ్యూల్ కూడా విడుదలచేశారు.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మొదలయ్యే బహిరంగసభల షెడ్యూల్ అనంతపురం బహిరంగసభతో ముగుస్తుంది. అలాగే ఒకటి రెండు రోజుల్లో లోకేష్ మంగళగిరిలో పర్యటనలు పెట్టుకోబోతున్నారు. సంక్రాంతి పండుగవరకు నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో పర్యటించబోతున్నారు. స్ధానిక నేతలు, క్యాడర్ తో మండలాల వారీగా సమీక్షలు జరపబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో లోకేష్ పర్యటనలు ఫిక్స్ చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలవకపోతే భవిష్యత్తు అయోమయంలో పడిపోవటం ఖాయం.

ఇక చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక కొందరు అభిమానులు, మద్దతుదారులు మరణించారు. ఆ కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించేందుకే అప్పట్లో నిజంగెలవాలి అనే స్లోగన్ తో యాత్రలు పెట్టుకున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు నాలుగైదు ఫ్యామిలీలను కలిసి పరామర్శించి తలా రు. 3 లక్షల విలువైన చెక్కులను అందించారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో కొన్ని కుటుంబాలను కలిసిన తర్వాత చంద్రబాబు బెయిల్ పైన బయటకొచ్చేశారు.

చంద్రబాబుకు బెయిల్ దొరికింది కాబట్టి భువనేశ్వరి యాత్రలను నిలిపేశారు. ఆగిపోయిన భువనేశ్వరి యాత్రలపై వైసీపీ బాగా సెటైర్లు వేసింది. మరి అందుకనో లేకపోతే ఇంకేదైనా కారణమో తెలీదు కాని భువనేశ్వరి నిజంగెలవాలని టూర్ ను మళ్ళీ పట్టుకున్నారు. మూడురోజులు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని బాధిత కుటుంబిలను పరామర్శించబోతున్నారు. తలా రు. 3 లక్షల చెక్కులను అందిస్తారు. 6వ తేదీ సాయంత్రానికి విశాఖపట్నం నుండి హైదరాబాద్ చేరుకుంటారు. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ పర్యటన ఉంటుందని పార్టీవర్గాలు చెప్పాయి.

This post was last modified on January 3, 2024 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago