కేసీయార్ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పధకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. పథకాన్ని రద్దుచేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలు ఇళ్ళు కట్టుకోవటానికి వీలుగా కేసీయార్ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే గృహలక్ష్మి పథకం. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్దిపొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేవు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ నేపధ్యంలోనే గృహలక్ష్మి పథకం రద్దుచేసినట్లు జీవో జారిఅయ్యింది. ఈ పథకంలో భాగంగానే లబ్దిదారులకు నిధులు మంజూరు చేయాలని ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అర్హులకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. లబ్దిదారుల ఎంపిక తర్వాత అవసరమైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
ఇంటికి రు. 3 లక్షల చొప్పున 4 లక్షల మంది లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేయాలని కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగానే 2.11 లక్షలమందికి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం శాంక్షన్ లెటర్లను కూడా జారిచేసింది. శాంక్షన్ లెటర్లను జారీచేసిందే కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అందుకనే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు సాయం చేయాలంటు జనాలు ప్రభుత్వన్ని రిక్వెస్టు చేసుకుంటున్నారు. ఇళ్ళకోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపికచేసి నిధులను విడుదల చేయాలన్నది రేవంత్ ప్రభుత్వం ఆలోచన. ఇళ్ళ నిర్మాణాల్లో అర్హులకు తలా రు. 5 లక్షల సాయం అందించనున్నట్లు సిక్స్ గ్యారెంటీస్ లో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీఇచ్చింది.
ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇపుడు రేవంత్ మీదుంది. అందుకనే ఈ పథకంపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రేవంత్ ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నది. 17 లోక్ సభ సీట్లలో అత్యధికంగా లబ్దిపొందటమే రేవంత్ ముందున్న ఏకైక టార్గెట్. అందుకనే ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను ఒక్కోటి అమల్లోకి తెస్తున్నారు.
This post was last modified on January 3, 2024 11:35 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…