కేసీయార్ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పధకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. పథకాన్ని రద్దుచేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలు ఇళ్ళు కట్టుకోవటానికి వీలుగా కేసీయార్ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే గృహలక్ష్మి పథకం. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్దిపొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేవు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ నేపధ్యంలోనే గృహలక్ష్మి పథకం రద్దుచేసినట్లు జీవో జారిఅయ్యింది. ఈ పథకంలో భాగంగానే లబ్దిదారులకు నిధులు మంజూరు చేయాలని ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అర్హులకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. లబ్దిదారుల ఎంపిక తర్వాత అవసరమైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
ఇంటికి రు. 3 లక్షల చొప్పున 4 లక్షల మంది లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేయాలని కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగానే 2.11 లక్షలమందికి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం శాంక్షన్ లెటర్లను కూడా జారిచేసింది. శాంక్షన్ లెటర్లను జారీచేసిందే కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అందుకనే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు సాయం చేయాలంటు జనాలు ప్రభుత్వన్ని రిక్వెస్టు చేసుకుంటున్నారు. ఇళ్ళకోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపికచేసి నిధులను విడుదల చేయాలన్నది రేవంత్ ప్రభుత్వం ఆలోచన. ఇళ్ళ నిర్మాణాల్లో అర్హులకు తలా రు. 5 లక్షల సాయం అందించనున్నట్లు సిక్స్ గ్యారెంటీస్ లో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీఇచ్చింది.
ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇపుడు రేవంత్ మీదుంది. అందుకనే ఈ పథకంపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రేవంత్ ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నది. 17 లోక్ సభ సీట్లలో అత్యధికంగా లబ్దిపొందటమే రేవంత్ ముందున్న ఏకైక టార్గెట్. అందుకనే ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను ఒక్కోటి అమల్లోకి తెస్తున్నారు.
This post was last modified on January 3, 2024 11:35 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…