కేసీయార్ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పధకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. పథకాన్ని రద్దుచేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలు ఇళ్ళు కట్టుకోవటానికి వీలుగా కేసీయార్ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే గృహలక్ష్మి పథకం. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్దిపొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేవు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ నేపధ్యంలోనే గృహలక్ష్మి పథకం రద్దుచేసినట్లు జీవో జారిఅయ్యింది. ఈ పథకంలో భాగంగానే లబ్దిదారులకు నిధులు మంజూరు చేయాలని ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అర్హులకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. లబ్దిదారుల ఎంపిక తర్వాత అవసరమైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
ఇంటికి రు. 3 లక్షల చొప్పున 4 లక్షల మంది లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేయాలని కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగానే 2.11 లక్షలమందికి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం శాంక్షన్ లెటర్లను కూడా జారిచేసింది. శాంక్షన్ లెటర్లను జారీచేసిందే కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అందుకనే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు సాయం చేయాలంటు జనాలు ప్రభుత్వన్ని రిక్వెస్టు చేసుకుంటున్నారు. ఇళ్ళకోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపికచేసి నిధులను విడుదల చేయాలన్నది రేవంత్ ప్రభుత్వం ఆలోచన. ఇళ్ళ నిర్మాణాల్లో అర్హులకు తలా రు. 5 లక్షల సాయం అందించనున్నట్లు సిక్స్ గ్యారెంటీస్ లో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీఇచ్చింది.
ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇపుడు రేవంత్ మీదుంది. అందుకనే ఈ పథకంపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రేవంత్ ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నది. 17 లోక్ సభ సీట్లలో అత్యధికంగా లబ్దిపొందటమే రేవంత్ ముందున్న ఏకైక టార్గెట్. అందుకనే ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను ఒక్కోటి అమల్లోకి తెస్తున్నారు.
This post was last modified on January 3, 2024 11:35 am
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…