ఆయన మంత్రిగారికి వేలు విడిచిన వియ్యంకుడు. చాలా దూరపు బంధువే.. అయినా.. రాజకీయంగా చూస్తే మాత్రం చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. దీంతో సదరు నాయకుడు.. మంత్రిగారి ప్రొద్బలంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ట్రై కూడా చేసేస్తున్నారు. దీంతో కీలకమైన నియోజకవర్గంలో రాజకీయ కాక పెరిగిపోయింది. మరి ఆ విశేషాలు.. తెలుసుకుందామా!
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చోడవరం. ఇక్కడ నుంచి వైఎస్కు అత్యంత విధేయుడు, సీఎం జగన్ అంటే.. ప్రాణం పెట్టేసే నాయకుడు కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే.. తన సీనియార్టీకి.. తన స్థాయికి మంత్రి పదవి దక్కలేదనే ఆవేదన ఈయనలోనూ ఉంది. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్నారు. కొన్నా ళ్ల కిందట బహిరంగంగా తన మనసులోమాట చెప్పేసి.. విమర్శలు గుప్పించారు.
దీనిని అనువుగా తీసుకున్న మంత్రి బూడి ముత్యాలనాయుడు.. తనకు దూరపు బంధువు, వరుసకు వేలు విడిచిన వియ్యంకుడు అయ్యే.. వైసీపీ వైద్యుల విభాగం జిల్లా అధ్యక్షుడు డా. బండారు సత్యనారాయణ మూర్తిని ప్రోత్సహించడం ప్రారంభించారు. దీంతో బండారు.. వచ్చే ఎన్నికల్లో చోడవరం టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. తెరవెనుక తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పైకి మాత్రం.. కరణం ధర్మశ్రీకి టికెట్ ఇవ్వకపోతే.. అది తనకే ఇవ్వాలని ప్రకటనలు చేస్తున్నారు.
ఇటీవల చోడవరంలో మీడియా మీటింగ్ పెట్టి మరీ.. డాక్టర్ బండారు.. ధర్మశ్రీని మార్చాలని అనుకుంటే తాను పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు.. ఇదేసమయంలో వైసీపీకి తాను చేసిన సేవలను ఏకరువు పెట్టారు. తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే.. ఇదంతా పక్కా ప్లాన్గా ఉందని.. మంత్రి బూడి ముత్యాలనాయుడు చక్రం తిప్పుతున్నారని కరణం వర్గం ఆరోపిస్తోంది.
మంత్రి బూడి ప్రోద్బలంతోనే బండారు రంగంలోకి దిగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో మం త్రి గారి వియ్యంకుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారా? అనే చర్చ నియోజకవర్గంలో వినిపిస్తుం డడం గమనార్హం. మరి పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ధర్మశ్రీకి ప్రాధాన్యం ఉంటుం దా? మార్పు చేస్తారా? అనేది కూడా ఆసక్తిగా మారింది.
This post was last modified on January 2, 2024 3:15 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…