Political News

మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్

ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధించే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, ఏపీలోని మందుబాబులంతా జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఓ పక్క మద్యం ధరలను అమాంతం పెంచేసిన ప్రభుత్వం…మరో పక్క మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఇక, ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యాన్నే అమ్మడం వంటి చర్యలతో…తమ ఫేవరెట్ బ్రాండ్లు దొరక్క మందుబాబులకు కిక్కు చాలడం లేదు. దీంతో, ఏపీలోని మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఇక్కడ దొరికే బ్రాండ్లు తాగలేక….పొరుగు రాష్ట్రం తెలంగాణకు వెళ్లి మద్యం కొనేందుకు నానా తిప్పలు పడుతున్నారు మందుబాబులు. హైకోర్టు తాజా తీర్పుతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చని కొందరు మందుబాబులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలోని కొందరు మందుబాబులకు తీపి కబురు అందించిన జగన్ సర్కార్……మరి కొందరు మందుబాబులకు షాక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచింది జగన్ సర్కార్. రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచిన ఏపీ ప్రభుత్వం…. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై ధరలను తగ్గించింది. బీర్లు, రెడీ టు డ్రింక్‌ ధరలు తగ్గించింది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరలను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. మంత్రివర్గ భేటీ తర్వాత ఏపీలోని మద్యం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ మద్యం బ్రాండ్ల ధరలు పెరిగినా….తోటి మందుబాబులలో కొందరి బ్రాండ్ల ధరలు తగ్గడంతో మందుబాబులంతా ఫుల్ జోష్ లో ఉన్నారట. ఏపీలో మందుబాబులకు ఒకేసారి తీపి, చేదు కబుర్లు అందడంతో….కిక్కురుమనకుండా కిక్కు ప్రాప్తిరస్తు అనుకుంటున్నారట.

This post was last modified on September 3, 2020 8:44 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

47 minutes ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

56 minutes ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

3 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

3 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

3 hours ago