Political News

మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్

ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధించే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, ఏపీలోని మందుబాబులంతా జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఓ పక్క మద్యం ధరలను అమాంతం పెంచేసిన ప్రభుత్వం…మరో పక్క మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఇక, ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యాన్నే అమ్మడం వంటి చర్యలతో…తమ ఫేవరెట్ బ్రాండ్లు దొరక్క మందుబాబులకు కిక్కు చాలడం లేదు. దీంతో, ఏపీలోని మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఇక్కడ దొరికే బ్రాండ్లు తాగలేక….పొరుగు రాష్ట్రం తెలంగాణకు వెళ్లి మద్యం కొనేందుకు నానా తిప్పలు పడుతున్నారు మందుబాబులు. హైకోర్టు తాజా తీర్పుతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చని కొందరు మందుబాబులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలోని కొందరు మందుబాబులకు తీపి కబురు అందించిన జగన్ సర్కార్……మరి కొందరు మందుబాబులకు షాక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచింది జగన్ సర్కార్. రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచిన ఏపీ ప్రభుత్వం…. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై ధరలను తగ్గించింది. బీర్లు, రెడీ టు డ్రింక్‌ ధరలు తగ్గించింది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరలను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. మంత్రివర్గ భేటీ తర్వాత ఏపీలోని మద్యం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ మద్యం బ్రాండ్ల ధరలు పెరిగినా….తోటి మందుబాబులలో కొందరి బ్రాండ్ల ధరలు తగ్గడంతో మందుబాబులంతా ఫుల్ జోష్ లో ఉన్నారట. ఏపీలో మందుబాబులకు ఒకేసారి తీపి, చేదు కబుర్లు అందడంతో….కిక్కురుమనకుండా కిక్కు ప్రాప్తిరస్తు అనుకుంటున్నారట.

This post was last modified on September 3, 2020 8:44 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago