Political News

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఫిట్టింగ్ పెట్టిందా?

నీవు నేర్పిన విద్యయే అన్న పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. అందుకనే మంత్రుల పర్యటనల్లో కావాలనే ప్రోటోకాల్ వివాదాన్ని తెస్తోంది. ప్రటోకాల్ పాటించటంపై తొందరలోనే కోర్టులో కేసులు వేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే జనగామ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఓడిపోయిన కాంగ్రెస్ నేతను కూడా మంత్రి వేదిక మీద కూర్చోబెట్టారు. దాన్ని పల్లా తీవ్రంగా వ్యతరేకించారు.

ఓడిపోయిన అభ్యర్ధిని వేదికపైన తనతో సమానంగా ఎలా కూర్చోబెడతారన్నది పల్లా పాయింట్. అయితే ఇక్కడే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ ఫిట్టింగ్ పెడుతోంది. ఎలాగంటే పదేళ్ళ కేసీయార్ పాలనలో ఇదే జరిగింది. మంత్రుల సమీక్షల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలను కాదని ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్ధులకే పెద్దపీట వేసింది. ఓడిపోయిన అభ్యర్ధులనే నియోజకవర్గాల ఇన్చార్జిలుగా కేసీయార్ ప్రభుత్వం నియమించింది. ఇన్చార్జిల పేరుమీదే నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నడిపింది. ఇవన్నీ అప్పట్లో ఎంఎల్సీగా పనిచేసిన పల్లాకు తెలియంది కాదు.

అన్నీ తెలిసినా ఇపుడు కావాలనే మంత్రితో  పల్లా గొడవ పెట్టుకున్నారు. మంత్రి కూడా ఎంఎల్ఏని లెక్కచేయలేదు. సమావేశంలో ఉంటే ఉండండి లేకపోతే పొమ్మన్నారు. దాంతో మండిపోయిన పల్లా సమావేశం నుండి వెళ్ళిపోయారు. తమ పదేళ్ళ హయాంలో కూడా ఇలాగే జరిగిన విషయాన్ని మరచిపోయినట్లే పల్లా వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. కేసీయార్ పాలనలో ప్రోటోకాల్ పాటించాలని కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు.

ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం నయమనే చెప్పాలి. ఎలాగంటే సమావేశానికి బీఆర్ఎస్ ఎంఎల్ఏని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టింది. కాకపోతే ఎంఎల్ఏతో పాటు ఓడిపోయిన నేతను కూడా కూర్చోబెట్టిందంతే. తనను కాదని ఓడిపోయిన నేతనే కూర్చోబెడితే పల్లా అభ్యంతరం చెప్పినా అర్ధముంటుంది. తమ హయాంలో అసలు కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలను పిలిచిన పాపాన కూడా పోలేదని పల్లాకు తెలీదా ? ఏదో ఒక సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లేయాలన్న ఆలోచననే బీఆర్ఎస్ లో కనబడుతోంది. మరి ప్రోటోకాల్ రగడ కోర్టుకెక్కితే ఏమవతుందో చూడాలి. 

This post was last modified on January 2, 2024 11:46 am

Share
Show comments
Published by
Satya
Tags: BRS

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago