Political News

అసమ్మతి నేతలపై వేటు తప్పదా ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, జరిగిన డెవలప్మెంట్ల ఆధారంగా అసమ్మతి నేతలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో బాగంగానే ఢిల్లీనుండి వచ్చి సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసమ్మతిపై వేటు వేయటంలో స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతిని మొగ్గలోనే తుంచేయటంలో భాగంగా ఎంతటి నేతలైనా సరే ఉపేక్షించవద్దని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమిత్ షా స్పష్టంగా చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.

అందుకనే 3వ తేదీన పార్టీ క్రమశిక్షణా కమిటి సమావేశమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జరిగిన వ్యవహారాలు కమిటి దృష్టికి వచ్చాయి. ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధుల నియోజకవర్గాల నుండి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నది. అభ్యర్ధుల ఓటమికి పనిచేసిన నేతలెవరు ? వాళ్ళు చేసిన ప్రయత్నాలేమిటనే వివరాలను రిపోర్టు రూపంలో తెప్పించుకున్నది. ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. మరో 16 నియోజకవర్గాల్లో రెండోప్లేసులో నిలిచింది.

అయితే ఇక్కడ నేతలంతా కలిసికట్టుగా పనిచేసుంటే మరో ఐదారు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచుండేదే అన్న భావనలో పార్టీనేతలున్నారు. ఎన్నికల సమయంలోనే కొన్ని నియోజకవర్గాల్లో నేతలు అభ్యర్ధులకు సహకరించటంలేదన్న ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో అభ్యర్ధులు ఏదో సర్దుబాటుకు ప్రయత్నించారు. అయితే ఫలితాల తర్వాత అప్పటి సర్దుబాట్లు పనిచేయలేదన్న విషయం అర్ధమైంది. అసమ్మతి, వెన్నుపోట్లు ఎక్కువగా కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు క్రమశిక్షణ కమిటికి పిర్యాదులు అందాయి. కరీంనగర్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓటమికి కూడా వెన్నుపోట్లే అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా బండి కూడా ప్రస్తావించారు.

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి వెన్నుపోట్లకు అవకాశం ఇవ్వకూడదని, వెన్నుపోటు నేతలపై వేటు వేస్తేకాని మిగిలిన వాళ్ళు దారికిరారని కమలనాదులు నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయమై కఠినంగా వ్యవహరించమని కిషన్ కు అమిత్ షా చెప్పారని సమాచారం. అందుకనే నియోజకవర్గాల నుండి అందిన ఫిర్యాదులు, జిల్లాల అధ్యక్షుడు మంగళవారం ఇవ్వబోయే రిపోర్టులపై 3వ తేదీన క్రమశిక్షణ కమిటి చర్చలుంటాయి. తర్వాత రిపోర్టును కిషన్ కు అందచేస్తుంది కమిటి. అప్పుడు కిషన్ ఏమిచేస్తారన్నది చూడాలి.

This post was last modified on January 2, 2024 10:14 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPTelangana

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago