Political News

మెట్రో లైన్ల ఖర్చుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మెట్రో, ఫార్మాసిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉందని, ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రో ను పొడిగిస్తామని చెప్పారు. ఇక, కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని రేవంత్ చెప్పారు. మరోవైపు, సోమవారం నాడు నాంపల్లి గ్రౌండ్స్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేలాది మంది వ్యాపారవేత్తలు ఈ నుమాయిష్ లో పాల్గొంటారని అన్నారు. హైదరాబాద్ పేరు చెబితే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయన్నారు. ఎన్నో హస్త కళలు, చేనేత కళలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ విక్రయిస్తారని, ప్రదర్శిస్తారని అన్నారు. నుమాయిష్ కమిటీలలో మహిళలకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు.

కాగా, ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ విజయవంతంగా ప్రయోగించడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు రేవంత్ అభినందనలు తెలిపారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ ను అధ్యయనం చేసేందుకు అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారత్ అవతరించిందని ప్రశంసించారు. కాగా, నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో రేవంత్ రెడ్డికి పూల మొక్కను బహూకరించి బండ్లన్న న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.‌

This post was last modified on January 1, 2024 10:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago