వైసీపీలో మార్పులు తప్పడం లేదు. సీనియర్ నేతలను కూడా వారికి ఉన్న గ్రాఫ్, ప్రజల్లో ఉన్న హవా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో టికెట్ వస్తుందని ఆశించిన వారికి కూడా కొంత నిరాశ తప్పడం లేదు. దీంతో కొందరు నాయకులు ఏకం గా పోటీ చేయబోమని ప్రకటించారు. మరికొందరు సహకరిస్తామని అంటున్నారు. ఏదేమైనా.. వైసీపీలో కొంత గందర గోళం నెలకొన్న మాట అయితే.. వాస్తవం.
ఇదిలావుంటే.. జగన్ అంటే.. ప్రాణం పెట్టే నాయకురాలిగా, వైఎస్ రాజన్న పేరును పచ్చ బొట్టు వేయిం చుకున్న మహిళా నేతగా పేరున్న మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో ఇవ్వరో అనే సందేహం నెలకొంది. ఆమెకు టికెట్ ఇవ్వద్దంటూ.. కుటుంబ సభ్యులు ఒకరు(మామ అని అంటున్నారు) పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు ప్రచారంలో ఉంది.
కొన్నాళ్లుగా కుటుంబ కలహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రెండో దఫా మంత్రివర్గం నుంచి కూడా తప్పించారనే చర్చ ఉంది. ఇక, అప్పటి నుంచి ఆమె లైమ్లైట్లో లేకుండా పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల రగడ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. ఆమె పేరు ఊరు ఎక్కడా వినిపించడం లేదు. పైగా.. ఆమె కుటుంబం నుంచి పార్టీకి లేఖ వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను బట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.
గత రెండు ఎన్నికల్లోకురుపా ఎస్టీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న పుష్ప శ్రీవాణి.. వరుస గా మూడో సారి కూడా పోటీ చేస్తారనే ప్రచారం గత ఆరు మాసాల వరకు బాగానే సాగింది. తర్వాత.. ఎందు కో మందగించింది. ఆమె పేరు ఊరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్నారో..లేక ఆశలు వదిలేసుకున్నారో తెలియడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 1, 2024 9:43 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…