వైసీపీలో మార్పులు తప్పడం లేదు. సీనియర్ నేతలను కూడా వారికి ఉన్న గ్రాఫ్, ప్రజల్లో ఉన్న హవా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో టికెట్ వస్తుందని ఆశించిన వారికి కూడా కొంత నిరాశ తప్పడం లేదు. దీంతో కొందరు నాయకులు ఏకం గా పోటీ చేయబోమని ప్రకటించారు. మరికొందరు సహకరిస్తామని అంటున్నారు. ఏదేమైనా.. వైసీపీలో కొంత గందర గోళం నెలకొన్న మాట అయితే.. వాస్తవం.
ఇదిలావుంటే.. జగన్ అంటే.. ప్రాణం పెట్టే నాయకురాలిగా, వైఎస్ రాజన్న పేరును పచ్చ బొట్టు వేయిం చుకున్న మహిళా నేతగా పేరున్న మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో ఇవ్వరో అనే సందేహం నెలకొంది. ఆమెకు టికెట్ ఇవ్వద్దంటూ.. కుటుంబ సభ్యులు ఒకరు(మామ అని అంటున్నారు) పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు ప్రచారంలో ఉంది.
కొన్నాళ్లుగా కుటుంబ కలహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రెండో దఫా మంత్రివర్గం నుంచి కూడా తప్పించారనే చర్చ ఉంది. ఇక, అప్పటి నుంచి ఆమె లైమ్లైట్లో లేకుండా పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల రగడ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. ఆమె పేరు ఊరు ఎక్కడా వినిపించడం లేదు. పైగా.. ఆమె కుటుంబం నుంచి పార్టీకి లేఖ వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను బట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.
గత రెండు ఎన్నికల్లోకురుపా ఎస్టీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న పుష్ప శ్రీవాణి.. వరుస గా మూడో సారి కూడా పోటీ చేస్తారనే ప్రచారం గత ఆరు మాసాల వరకు బాగానే సాగింది. తర్వాత.. ఎందు కో మందగించింది. ఆమె పేరు ఊరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్నారో..లేక ఆశలు వదిలేసుకున్నారో తెలియడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 1, 2024 9:43 pm
వరస ఫ్లాపులతో సతమవుతున్నప్పుడు యూత్ హీరో కిరణ్ అబ్బవరంకు 'క' ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా మార్కెట్ ని…
రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నవ శకానికి నాందీ పలికారు. నిన్నటిదాకా రాజకీయం…
ఏపీలో రాజకీయం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు కాగా… ఆ విస్తుగొలిపే ఫలితాలకు అనుగుణంగానే…
కొత్త ఏడాదిలో రెండో నెల వచ్చేసింది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…