Political News

రాహుల్ గాంధీ తో షర్మిల భేటీ

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిలకు ముహూర్తం రెడీ అయ్యిందా ? అవుననే సమాచారం వస్తోంది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి. ఈనెల 3 లేదా 7వ తేదీన పార్టీలోకి షర్మిల ఎంట్రీ ఉండచ్చని అంచనా అనుకుంటున్నారు. ఎంట్రీతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడుకునేందుకు షర్మిల మంగళవారం ఢిల్లీకి వెళ్ళి రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయట.

పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే అధిష్టానం షర్మిల ముందు రెండు ఆప్షన్లుంచిందట. అదేమిటంటే ఏపీ పార్టీ పగ్గాలు అందుకున్నాక  కర్నాటక లేదా తెలంగాణా నుండి రాజ్యసభకు నామినేట్ అవ్వటం. రెండో ఆప్షన్ ఏమిటంటే పార్టీపగ్గాలు అందుకున్నాక రాబోయే ఎన్నికల్లో కడప లోక్ సభకు పోటీచేయటం. ఈ రెండు ఆప్షన్లలో  షర్మిల దేనివైపు మొగ్గుచూపుతుందన్న విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. ఆప్షన్ ఏదైనా మెయిన్ టార్గెట్ సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అన్న విషయం అర్ధమవుతోంది.

జగన్ను టార్గెట్ చేయటం ఇష్టంలేకే షర్మిల తెలంగాణాలో వేరుకుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణాలో ఉనికి కూడా చాటుకోలేకపోయిన నేపధ్యంలో వేరేదారిలేక తిరిగి ఏపీలోకి రావాల్సొస్తోంది. కాంగ్రెస్ లో చేరకపోతే ఏమి చేసుండేవారో కానీ ఇపుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోక తప్పటంలేదు. కాబట్టి జగన్ను టార్గెట్ చేయకా తప్పదు. దాంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్ కుటుంబంలోని విభేదాలన్నీ రోడ్డున పడటం ఖాయమని అర్ధమవుతోంది. ఇదే సందర్భంగా పార్టీని బలోపేతం చేయటంలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలమేయటం కూడా  ఎజెండాలో బాగమే.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలో టికెట్లు దక్కని సీనియర్లకు గాలమేసి అలాంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యత కూడా షర్మిల మీదే ఉంటుంది. ఆ రకంగా కాంగ్రెస్ కు సడెన్ బూస్టప్ వచ్చినట్లవుతుంది. తక్కువలో తక్కువ ఓ 20 మంది ఎంఎల్ఏలు, మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ తరపున పోటీలోకి దిగితే ఎంతో కొంత ప్రభావం ఉండటం ఖాయం. ఆ రకంగా కాంగ్రెస్ బలోపేతమవ్వాలని ఆలోచిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. 

This post was last modified on January 1, 2024 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago