Political News

టీడీపీలో ఈ కుటుంబాల‌కు రెండేసి సీట్లు..

ఇత‌ర పార్టీల‌కు టీడీపీకి చాలా తేడా క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల్లో బంధువ‌ర్గ కుటుంబాలు చాలా వ‌ర‌కు త‌క్కువ‌. కానీ, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి జిల్లాలోనూ బంధు వ‌ర్గ కుటుంబాలు క‌నిపిస్తాయి. దీంతో పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి  ఒక్క‌టే టికెట్ అనే  లైను పెట్టుకున్నా వీరి విష‌యంలో మాత్రం.. దీనిని దాట‌వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. ఆకుటుంబాలు అంత బ‌లంగా పార్టీలో వ్య‌వ‌హ‌రిస్తు న్నాయి.

ఫ‌లితంగా ఈ బంధువ‌ర్గ కుటుంబాల‌కు రెండేసి చొప్పున టికెట్లు కేటాయింపు అనివార్యంగా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు వియ్యంకులు టీడీపీకి రెండు క‌ళ్ల వంటి వారు. వీరిద్ద‌రికీ టికెట్‌లు ఇవ్వ‌క త‌ప్ప‌దు. వారే వినుకొండ నుంచి జీవీ ఆంజ‌నేయులు, పెద్ద‌కూర‌పాడు నుంచి కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌. ఇక‌, తూర్పు గోదావ‌రి విష‌యానికి వ‌స్తే.. కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు వియ్యంకులు ఇద్ద‌రూ పార్టీలోనే ఉన్నారు. బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఆదిరెడ్డి వాసు వీరిద్ద‌రికీ టికెట్లు ఇవ్వాల్సిందే.

అదేవిధంగా కింజ‌రాపు బాబాయి-అబ్బాయి.. అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్‌నాయుడుకు కూడా టికెట్ త‌ప్పదు. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌లు వియ్యంకులు.. వీరిద్ద‌రూ చంద్ర‌బాబుకు అత్యంత కావాల్సిన వారు. పైగా కాపు సామాజిక వ‌ర్గం దీంతో ఇద్ద‌రికీ టికెట్ లు ఇవ్వ‌క త‌ప్ప‌దు. ఇక‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కుమార్తె దివ్య‌కు ఈ ద‌ఫా టికెట్ ఇస్తున్నారు. వీరి సొంత నియోజ‌క‌వ‌ర్గం తుని టికెట్‌ను కేటాయించారు.

ఇదేస‌మ‌యంలో య‌న‌మ‌ల వియ్యంకుడు, క‌డ‌ప జిల్లాకు చెందిన మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్‌కు కూడా టికెట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు. అదేవిధంగా నంద‌మూరి కుటుంబానికి కూడా రెండు టికెట్ కేటాయించాల్సిందే. నంద‌మూరి బాల‌య్య‌కు హిందూపురం అసెంబ్లీ, ఆయ‌న చిన్న‌ల్లుడు శ్రీభ‌ర‌త్‌కు.. విశాఖ పార్ల‌మెంటు సీటు ఇవ్వాల్సిందే. ఇక‌, నారా కుటుంబానికి ఇప్ప‌టికే రెండు సీట్లు ఖ‌రార‌య్యాయి. చంద్రాబాబు  కుప్పం నుంచి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇక్క‌డ వీరు గెలుస్తారా?  లేదా?  అనే విష‌యంతో సంబంధం లేదు.. టికెట్ మాత్రం ఇవ్వ‌క త‌ప్ప‌దు.. అది అంతే!!

This post was last modified on January 1, 2024 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago