Political News

టీడీపీలో ఈ కుటుంబాల‌కు రెండేసి సీట్లు..

ఇత‌ర పార్టీల‌కు టీడీపీకి చాలా తేడా క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల్లో బంధువ‌ర్గ కుటుంబాలు చాలా వ‌ర‌కు త‌క్కువ‌. కానీ, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి జిల్లాలోనూ బంధు వ‌ర్గ కుటుంబాలు క‌నిపిస్తాయి. దీంతో పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి  ఒక్క‌టే టికెట్ అనే  లైను పెట్టుకున్నా వీరి విష‌యంలో మాత్రం.. దీనిని దాట‌వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. ఆకుటుంబాలు అంత బ‌లంగా పార్టీలో వ్య‌వ‌హ‌రిస్తు న్నాయి.

ఫ‌లితంగా ఈ బంధువ‌ర్గ కుటుంబాల‌కు రెండేసి చొప్పున టికెట్లు కేటాయింపు అనివార్యంగా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు వియ్యంకులు టీడీపీకి రెండు క‌ళ్ల వంటి వారు. వీరిద్ద‌రికీ టికెట్‌లు ఇవ్వ‌క త‌ప్ప‌దు. వారే వినుకొండ నుంచి జీవీ ఆంజ‌నేయులు, పెద్ద‌కూర‌పాడు నుంచి కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌. ఇక‌, తూర్పు గోదావ‌రి విష‌యానికి వ‌స్తే.. కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు వియ్యంకులు ఇద్ద‌రూ పార్టీలోనే ఉన్నారు. బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఆదిరెడ్డి వాసు వీరిద్ద‌రికీ టికెట్లు ఇవ్వాల్సిందే.

అదేవిధంగా కింజ‌రాపు బాబాయి-అబ్బాయి.. అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్‌నాయుడుకు కూడా టికెట్ త‌ప్పదు. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌లు వియ్యంకులు.. వీరిద్ద‌రూ చంద్ర‌బాబుకు అత్యంత కావాల్సిన వారు. పైగా కాపు సామాజిక వ‌ర్గం దీంతో ఇద్ద‌రికీ టికెట్ లు ఇవ్వ‌క త‌ప్ప‌దు. ఇక‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కుమార్తె దివ్య‌కు ఈ ద‌ఫా టికెట్ ఇస్తున్నారు. వీరి సొంత నియోజ‌క‌వ‌ర్గం తుని టికెట్‌ను కేటాయించారు.

ఇదేస‌మ‌యంలో య‌న‌మ‌ల వియ్యంకుడు, క‌డ‌ప జిల్లాకు చెందిన మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్‌కు కూడా టికెట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు. అదేవిధంగా నంద‌మూరి కుటుంబానికి కూడా రెండు టికెట్ కేటాయించాల్సిందే. నంద‌మూరి బాల‌య్య‌కు హిందూపురం అసెంబ్లీ, ఆయ‌న చిన్న‌ల్లుడు శ్రీభ‌ర‌త్‌కు.. విశాఖ పార్ల‌మెంటు సీటు ఇవ్వాల్సిందే. ఇక‌, నారా కుటుంబానికి ఇప్ప‌టికే రెండు సీట్లు ఖ‌రార‌య్యాయి. చంద్రాబాబు  కుప్పం నుంచి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇక్క‌డ వీరు గెలుస్తారా?  లేదా?  అనే విష‌యంతో సంబంధం లేదు.. టికెట్ మాత్రం ఇవ్వ‌క త‌ప్ప‌దు.. అది అంతే!!

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

8 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

15 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

29 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago