Political News

ఉద్యోగులకు రేవంత్ ‘స్వీట్’ కబురు?

ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఇకనుండి ప్రతినెలా మొదటి రెండు రోజుల్లోనే జీతాలు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారట. జీతాలతో పాటు పెన్షన్లు, బిల్లులను కూడా చెల్లించేందుకు రెడీ అవ్వాలని రేవంత్ ఆదేశించారట. కేసీయార్ పదేళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు ఏ నాడూ నెలమొదట్లో రాలేదు.

నిజానికి ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని నిబంధన ఏమీలేదు. కాకపోతే మొదటి తేదీనే జీతాలు చెల్లించటం అన్నది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను, పరిస్ధితిని తెలియజేస్తుంది. ఈ సూత్రం ప్రభుత్వానికే కాదు ప్రైవేటు సంస్ధలకు కూడా వర్తిస్తుంది. అందుకనే ఉద్యోగులకు జీతాల చెల్లింపును ప్రభుత్వాలైనా, ప్రైవేటు సంస్ధలైనా మొదటి రెండురోజులను పెట్టుకున్నాయి. కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్ధితి మారిపోయింది. ఒకవైపు దేశంలోనే తెలంగాణా అత్యంత ధనిక రాష్ట్రమని చెబుతునే జీతాలు మాత్రం ఇచ్చేవారు కాదు.

చాలా శాఖల్లో ఉద్యోగులకు రెండు మూడు వారాల్లో జీతాలు అందేవి. కొన్ని శాఖల్లో అయితే జీతాలకు ఆల్ఫాబెట్ల క్రమాన్ని కూడా అమలుచేశారు. జీతాల పరిస్ధితే ఇలాగుంటే ఇక పెన్షన్ల గురించి, బిల్లుల క్లియరెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పరిస్దితులను దృష్టిలో పెట్టుకునే ప్రతినెల మొదటి రెండు రోజుల్లోనే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని రేవంత్  డిసైడ్ అయ్యారట. అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కలిపి సుమారు రు. 6 కోట్లు అవసరమవుతుంది. ఏ ప్రభుత్వమైనా ఈ మొత్తాన్ని ప్రతి నెల మూడోవారంలోనే రెడీగా పెట్టుకుంటుంది. శాలరీ బిల్లులను రెడీచేసుకుని ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేట్లుగా బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు నాలుగోవారం అవుతుంది. దాంతో నెల మొదట్లోనే జీతాలు పడేందుకు అవకాశం ఉంటుంది. కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కసరత్తు అంతా అస్తవ్యస్ధమైపోయింది. అందుకనే ఇపుడు రేవంత్ ఇచ్చిన ఆదేశాలు ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు లాగ వినబడుతోంది.

This post was last modified on December 31, 2023 8:47 pm

Share

Recent Posts

వైసీపీ ఎత్తుగ‌డ‌: బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా…?

కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ క‌య్యానికి సుముఖంగా లేమ‌ని వైసీపీ స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…

28 minutes ago

సీనియర్లను ట్రోల్ చేస్తే ఎవరికి ప్రయోజనం

ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…

2 hours ago

అసలైన అనిరుధ్ బయటికి వచ్చాడు

గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…

3 hours ago

ఇప్పటికీ సచినే నెంబర్ వన్

సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…

6 hours ago

నోరు అదుపులో పెట్టుకోక‌పోతే… కోడిగుడ్లే ప‌డ‌తాయి: సుప్రీంకోర్టు

``దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చేందుకు మ‌న వాళ్లు తుపాకీ తూటాల‌కే వెనుకాడ‌లేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్ల‌కు భ‌య‌ప‌డ‌తారా?``అంటూ.. తృణ‌మూల్…

6 hours ago

`టార్గెట్ లోకేష్‌`… సింప‌తీ రాదు జ‌గ‌న్‌… !

ప్ర‌స్తుతం వైసీపీ పెట్టుకున్న ల‌క్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించ‌డం. గ‌త వారం రోజులుగా ఈ విష‌యాన్ని…

9 hours ago