Political News

టికెట్ ఎఫెక్ట్‌.. మైల‌వ‌రంలో తొలి రాజీనామా!

వైసీపీలో టికెట్ల వేడి కొనసాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌ను ఆశిస్తున్న‌వా రు కూడా.. పొలిటిక‌ల్ సెగ పెంచుతున్నారు. టికెట్ ఇవ్వాల్సిందేన‌న్న ప‌ట్టుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మ‌రికొందరు వేచి చూస్తున్నారు. చాలా త‌క్కు వ సంఖ్య‌లో మాత్ర‌మే స‌ర్దుకు పోతున్నారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో  టికెట్ ఆశిస్తున్న కీల‌క నాయ‌కుడు పార్టీకి రాజీనామా చేశారు.

మైలవరం మండ‌లం మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ బొమ్మసాని చలపతి రావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ను ఆశించారు. దీనికి మంత్రి జోగి ర‌మేష్ కూడా భ‌రోసా ఇచ్చారు. నేను ఉన్నాను.. నీకు టికెట్ ఇప్పిస్తాన‌ని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో టికెట్ల వ్య‌వ‌హారం ఎవ‌రిచేతిలోనూ లేకుండా పోవ‌డం.. స‌ర్వేల‌పైనే ఆధార‌ప‌డి టికెట్లు ఇస్తున్న నేప‌థ్యంలో బొమ్మ‌సానికి నిరాశే ఎదురైంది.

దీంతో ఆయ‌న తాజాగా పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుంద‌ని ఆశించాన‌ని.. కానీ, అది జ‌రిగే ప‌నికాద‌ని ఆల‌స్యంగా తెలిసింద‌ని అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఖరీకి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు బొమ్మసాని ప్రకటించారు. పార్టీ కష్టకాల సమయంలో పని చేస్తే తనకు విలువ ఇవ్వకపోవడంఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి జోగి రమేష్‌పైనా బొమ్మ‌సాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చందాలు ఇచ్చి అండగా ఉన్న త‌న‌కు టికెట్ ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చి కూడా పట్టించుకోలేద‌ని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయం సొంత ఎస్టేట్‌గా మార్చి.. ఇంచార్జులు సూపర్‌వైజర్లుగా, పార్టీ నాయకులు, కార్యకర్తలను స్వీపర్లుగా ఎమ్మెల్యే  మార్చారని బొమ్మసాని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 

This post was last modified on December 31, 2023 8:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

33 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

51 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago