ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఒక ప్రత్యేక మైన ఓటు బ్యాంకు ఉంది. అదే.. క్రిస్టియన్ ఓటు బ్యాంకు. గత 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ వీరు వైసీపీకి మద్దతుగా నిలిచారు. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా.. ఎస్సీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇక, 2019లో అయితే..ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్క కొండపి మినహా.. అన్నింటి లోనూ క్లీన్ స్వీప్ చేసేసింది.
అయితే.. ఇంతటి బలమైన క్రిస్టియన్ ఓటు బ్యాంకు.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకం టే.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్తనయ షర్మిలకు అప్పగిస్తారనేప్రచారం ఊపందుకుంది. దీంతో ఎస్సీ ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. వ్యక్తిగతంగా జగన్తో విభేదిస్తున్న షర్మిల భర్త, సీఎం జగన్కు సొంత బావ బ్రదర్ అనిల్ కుమార్.. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలను వైసీపీ కంచుకోటలుగా భావిస్తోంది. షర్మిల రాకతో ఆ కోటకు బీటలు వారడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, షర్మిల భర్త బ్రదర్ అనిల్కు క్రిస్టియన్లలో మంచి ఆదరణ ఉంది. ఆయన గతంలోనూ ఏపీలోని పలు పట్టణాల్లో క్రైస్తవ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వర్గాన్ని పూర్తిస్థాయిలో తమ ఓటు బ్యాంకుగా వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్లోకి చేరితే పరిణామాలు మరింత మారే అవకాశం ఉండనుంది.
బ్రదర్ అనిల్ ప్రభావం కూడా ఎస్సీ ల ఓటు బ్యాంకుపై ఉంటుందని.. అప్పుడు వైసీపీ కీలక ఓటు బ్యాం కు కదిలిపోయే అవకాశం ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. మరి రాజకీయాల్లో భావోద్వేగాలు.. సెంటిమెంట్లకు ప్రధాన స్థానం ఉండడంతో బ్రదర్ అనిల్కుమార్ ఆయా ఓటు బ్యాంకును వైసీపీకి దూరం చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on December 31, 2023 3:57 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…