Political News

తగ్గేదే లేదు.. నీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌కు జగన్ సవాల్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదా అంత తేలిగ్గా తెగేలా లేదు. ఇంతకుముందు మెతక వైఖరితో కనిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ వాటాను వాడుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించడానికి ఆయన సిద్ధం అయిపోతున్నారు.

రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 ప్రాజెక్టులు పనులను చేపట్టేందుకు ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. శ్రీశైలం నుంచి నీటిని వాడుకుంటూ ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా నిర్మించే 27 ప్రాజెక్టుల కోసం అవసరమైన మౌళిక సదుపాయాలు, నిధుల సమీకరణ కోసం ఏపీ ప్రభుత్వం జూన్ 27న ఎస్పీవీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాయలసీమ కరవు నివారణ కోసం 14 ప్రాజెక్టులు నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఐతే ఈ ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవాలంటూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం తప్పనిసరి. ఐతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్మించిందని తెలంగాణ సర్కారు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచితే తాము తీవ్రంగా నష్టపోతామని.. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సాగు, తాగు నీటికి కష్టాలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

ఐతే విభజన చట్టం ప్రకారం శ్రీశైలం నుంచి తమ వాటాను కచ్చితంగా వాడుకుంటామని.. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏంటని ఏపీ సర్కారు వాదిస్తోంది. దీనిపై కొంత కాలంగా ఇరు ప్రభుత్వాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి తమ వాటా నీటిని ఏపీ ప్రభుత్వం 120 రోజుల్లో తీసుకుంటుండగా.. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా అంతే నీటిని 30 నుండి 40 రోజుల్లోనే తీసుకోవాలని చూస్తోంది.

This post was last modified on September 3, 2020 7:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

50 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

3 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

4 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

4 hours ago