క్రిస్మస్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల క్రిస్ట్ మస్ గిఫ్ట్ పంపిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన సోదరుడు సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు గిఫ్ట్ పంపడం…ఆ గిఫ్ట్ పంపిన షర్మిలకు లోకేష్ ధన్యవాదాలు తెలపడం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన లోకేష్ ను ఓ మీడియా ప్రతినిధి ఆ గిఫ్ట్ గురించి అడిగారు.
“షర్మిల మీకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించినట్టు అనుకుంటున్నారు” అన్న ప్రశ్నకు లోకేష్ నవ్వుతూ బదులిచ్చారు. “అనుకోవడం ఏంటండీ…. ఆమె పంపించారు… దానిపై నేను ట్వీట్ చేశాను కూడా” అని లోకేష్ అన్నారు. గిఫ్ట్ ఎందుకు పంపారన్న విషయం అడగాల్సింది తనను కాదని అన్నారు. మరోవైపు, అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై సీఎం జగన్ కు లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వారంలోపు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
జగన్ పాలనలో 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా రూ.10 లక్షల సాయం ఇచ్చారా? ఇదేనా మీ మానవత్వం? అని నిలదీశారు. వైఎస్ హయాంలో అగ్రిగోల్డ్ పుట్టి ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ స్కాం జరిగిందని ఆరోపించారు. కానీ, 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ కు చెందిన 21 వేల ఎకరాల ఆస్తులు జప్తు చేశామని, అయినా సరే ఆనాటి ప్రతిపక్ష నేతగా టీడీపీపై జగన్ బురదజల్లారని గుర్తు చేశారు.
This post was last modified on December 31, 2023 1:06 am
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…