సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ను జల్లెడ పడుతోంది. ఏకంగా ఎనిమిది మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్రావు నివాసానికి చేరుకుని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. అయితే… కొలికపూడి హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యను విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
కొలికపూడి భార్య అప్పటికే ఆఫీసుకు వెళ్లింది. అయితే ఆమెని తమ ఆఫీసుకు(విజయవాడ) రావాలని, కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సీఐడీ అధికారులు ఒత్తిడి చేసినట్టు సమాచారం. అయితే, తన ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను రాలేనని ఆమె చెప్పారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు వినలేదని కొలికపూడి భార్య ఆందోళన వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్రావు ఉంటున్న అపార్ట్మెంట్లోకి ఎలాగైనా వెళ్లాలని సీఐడీ బృందం ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు.. అపార్ట్మెంట్ ఫ్లోర్లోకి వచ్చిన సీఐడీ బృందం కొలికపూడి శ్రీనివాస్రావు కోసం వేచి చూస్తోంది. ఈ రోజు ఎలాగైనా ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ అధికారులు ప్లాన్ చేశారు. ఇదిలావుంటే, రాం గోపాల్ వర్మ ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని స్వయంగా కలుసుకుని కొలికపూడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తన తల తెచ్చిన వారికి రూ.కోటి సుపారీ ఇస్తానని కొలికపూడి ఓ టీవీ ఛానెల్లోనూ వ్యాఖ్యానించారని.. వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపషథ్యంలోనే సీఐడీ పోలీసులు అరెస్టుకు ఉపక్రమించారు. ఇదిలావుంటే.. మరోవైపు కొలికపూడి తన న్యాయవాదుల ద్వారా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తనకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 30, 2023 7:39 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…