సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ను జల్లెడ పడుతోంది. ఏకంగా ఎనిమిది మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్రావు నివాసానికి చేరుకుని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. అయితే… కొలికపూడి హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యను విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
కొలికపూడి భార్య అప్పటికే ఆఫీసుకు వెళ్లింది. అయితే ఆమెని తమ ఆఫీసుకు(విజయవాడ) రావాలని, కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సీఐడీ అధికారులు ఒత్తిడి చేసినట్టు సమాచారం. అయితే, తన ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను రాలేనని ఆమె చెప్పారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు వినలేదని కొలికపూడి భార్య ఆందోళన వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్రావు ఉంటున్న అపార్ట్మెంట్లోకి ఎలాగైనా వెళ్లాలని సీఐడీ బృందం ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు.. అపార్ట్మెంట్ ఫ్లోర్లోకి వచ్చిన సీఐడీ బృందం కొలికపూడి శ్రీనివాస్రావు కోసం వేచి చూస్తోంది. ఈ రోజు ఎలాగైనా ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ అధికారులు ప్లాన్ చేశారు. ఇదిలావుంటే, రాం గోపాల్ వర్మ ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని స్వయంగా కలుసుకుని కొలికపూడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తన తల తెచ్చిన వారికి రూ.కోటి సుపారీ ఇస్తానని కొలికపూడి ఓ టీవీ ఛానెల్లోనూ వ్యాఖ్యానించారని.. వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపషథ్యంలోనే సీఐడీ పోలీసులు అరెస్టుకు ఉపక్రమించారు. ఇదిలావుంటే.. మరోవైపు కొలికపూడి తన న్యాయవాదుల ద్వారా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తనకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 30, 2023 7:39 pm
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…