సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ను జల్లెడ పడుతోంది. ఏకంగా ఎనిమిది మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్రావు నివాసానికి చేరుకుని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. అయితే… కొలికపూడి హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యను విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
కొలికపూడి భార్య అప్పటికే ఆఫీసుకు వెళ్లింది. అయితే ఆమెని తమ ఆఫీసుకు(విజయవాడ) రావాలని, కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సీఐడీ అధికారులు ఒత్తిడి చేసినట్టు సమాచారం. అయితే, తన ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను రాలేనని ఆమె చెప్పారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు వినలేదని కొలికపూడి భార్య ఆందోళన వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్రావు ఉంటున్న అపార్ట్మెంట్లోకి ఎలాగైనా వెళ్లాలని సీఐడీ బృందం ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు.. అపార్ట్మెంట్ ఫ్లోర్లోకి వచ్చిన సీఐడీ బృందం కొలికపూడి శ్రీనివాస్రావు కోసం వేచి చూస్తోంది. ఈ రోజు ఎలాగైనా ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ అధికారులు ప్లాన్ చేశారు. ఇదిలావుంటే, రాం గోపాల్ వర్మ ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని స్వయంగా కలుసుకుని కొలికపూడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తన తల తెచ్చిన వారికి రూ.కోటి సుపారీ ఇస్తానని కొలికపూడి ఓ టీవీ ఛానెల్లోనూ వ్యాఖ్యానించారని.. వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపషథ్యంలోనే సీఐడీ పోలీసులు అరెస్టుకు ఉపక్రమించారు. ఇదిలావుంటే.. మరోవైపు కొలికపూడి తన న్యాయవాదుల ద్వారా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తనకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…