వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న సంకల్పంతో “సీబీఎన్ ఫోరం“ రంగంలోకి దిగింది. ఫోరం ప్రతినిధులు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. రాష్ట్రంలో సమస్యలపై అంశాల వారీగా వివరిస్తూ ప్రజలకు సీబీఎన్ ఫోరం అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఉమ్మడి కృష్నాజిల్లాలోని నందిగామలో `దళిత గళం` పేరుతో వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది.
సీబీఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ‘‘సీబీయన్ ఫోరం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. 2020 విజన్ ద్వారా చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ఐటీ విప్లవం తీసుకు వచ్చారు. ఆయన ముందు చూపు కారణంగానే లక్షలాది మంది తెలుగువాళ్లు ఐటీ రంగంలో రాణిస్తున్నారు. అటువంటి చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారు. వాస్తవాలను వివరించాలనే మేమంతా కలిసి సీబీయన్ పోరం ప్రారంభించాం. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి, యువతకు జరిగిన మేలు గురించి వివరిస్తున్నాం. చంద్రబాబు మార్కు అభివృద్ధిని, విజన్ను మరోసారి గుర్తు చేస్తున్నాం“ అని సుమిత వివరించారు.
సీబీయన్ ఫోరంలో అన్ని వర్గాల వారు ప్రతినిధులుగా ఉన్నారని పోరం ప్రధాన కార్యదర్శి అమర్ తెలిపారు. కొంతమంది ఒక సామాజికవర్గం పేరు చెప్పి వారి తప్పులు బయటపడకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఏపీకి ఎంత మేలు జరిగిందో వివరిస్తున్నామన్నారు. భాబు విజన్ను అర్థం చేసుకుంటే.. భవిష్యత్ తరాలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. “2020 చంద్రబాబు విజన్ వల్లే మేమంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. 2047 విజన్ ద్వారా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు, యువత మమ్మల్ని చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి“ అని అమర్ పిలుపునిచ్చారు.
This post was last modified on December 30, 2023 7:36 pm
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల దిగుమతులపై భారీఎత్తున సుంకాలు (టారిఫ్లు)…
అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్…
ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక…