Political News

చంద్ర‌బాబు కోసం రంగంలోకి `సీబీఎన్ ఫోరం`

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న సంక‌ల్పంతో “సీబీఎన్ ఫోరం“ రంగంలోకి దిగింది. ఫోరం ప్రతినిధులు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్ర‌ణాళిక రూపొందించుకున్నారు. రాష్ట్రంలో సమస్యలపై అంశాల వారీగా వివరిస్తూ ప్రజలకు సీబీఎన్ ఫోరం అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని నందిగామలో `దళిత గళం` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం దళితులకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న ల‌భించింది.

 సీబీఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత ఈ కార్య‌క్ర‌మానికి నేతృత్వం వ‌హించారు. ‘‘సీబీయన్ ఫోరం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. 2020 విజన్ ద్వారా చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ఐటీ విప్లవం తీసుకు వచ్చారు. ఆయన ముందు చూపు కారణంగానే లక్షలాది మంది తెలుగువాళ్లు ఐటీ రంగంలో రాణిస్తున్నారు. అటువంటి చంద్రబాబును అన్యాయంగా  జైల్లో పెట్టారు. వాస్తవాలను వివరించాలనే మేమంతా కలిసి సీబీయన్ పోరం ప్రారంభించాం. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి, యువతకు జరిగిన మేలు గురించి వివరిస్తున్నాం.  చంద్రబాబు మార్కు అభివృద్ధిని, విజ‌న్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాం“ అని సుమిత వివ‌రించారు.  

సీబీయన్ ఫోరంలో అన్ని వర్గాల వారు ప్రతినిధులుగా ఉన్నారని పోరం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అమర్ తెలిపారు.  కొంతమంది ఒక సామాజికవర్గం పేరు చెప్పి వారి తప్పులు బయటపడకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఏపీకి ఎంత మేలు జరిగిందో వివరిస్తున్నామ‌న్నారు. భాబు విజన్‌ను అర్థం చేసుకుంటే.. భవిష్యత్ తరాలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. “2020 చంద్ర‌బాబు విజన్ వల్లే మేమంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. 2047 విజన్ ద్వారా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు, యువత మమ్మల్ని చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి“ అని అమ‌ర్ పిలుపునిచ్చారు.  

This post was last modified on December 30, 2023 7:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

34 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

52 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago