ఏపీ సీఐడీ, ఇంటెలిజెన్స్ చీఫ్లపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ న్యాయ పోరాటానికి దిగింది. వీరి కారణంగా.. టీడీపీ ఇబ్బందులు పడుతోందని, పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టు సీఐడీ, ఇంటెలిజెన్స్చీఫ్లు ఆడుతున్నారని పేర్కొంటూ టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో సీఐ డీ అధికారులు సహా.. ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది. ఈ మేరకు టీడీపీ నేత కిలారు రాజేష్ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమపై వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ చెబుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత కిలారు రాజేష్ను సాక్షిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారనే ఆరోపణలు వున్నాయి. స్వయంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారని ఆయన చెబుతున్నారు.
అసలు ఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని ఆయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తా మని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేసి..ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహించారని తాజాగా కిలారు తన పిటషన్లో పేర్కొన్నారు. తను చేసిన ఆరోపణలను సీఐడీ, ఇంటెలిజెన్స్ తోసిపుచ్చుతున్న నేపథ్యంలో ఆయా ఆరోపణలకు ఆధారాలను చూపించేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.
కాల్ రికార్డులు, సీఐడీ ఆఫీసు సీసీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీతారామాంజ నేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి అని పేర్కొన్నారు. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారని తెలిపారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారని చెప్పారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారిద్దరూ… జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
This post was last modified on December 30, 2023 3:28 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…