ఏపీ సీఐడీ, ఇంటెలిజెన్స్ చీఫ్లపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ న్యాయ పోరాటానికి దిగింది. వీరి కారణంగా.. టీడీపీ ఇబ్బందులు పడుతోందని, పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టు సీఐడీ, ఇంటెలిజెన్స్చీఫ్లు ఆడుతున్నారని పేర్కొంటూ టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో సీఐ డీ అధికారులు సహా.. ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది. ఈ మేరకు టీడీపీ నేత కిలారు రాజేష్ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమపై వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ చెబుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత కిలారు రాజేష్ను సాక్షిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారనే ఆరోపణలు వున్నాయి. స్వయంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారని ఆయన చెబుతున్నారు.
అసలు ఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని ఆయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తా మని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేసి..ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహించారని తాజాగా కిలారు తన పిటషన్లో పేర్కొన్నారు. తను చేసిన ఆరోపణలను సీఐడీ, ఇంటెలిజెన్స్ తోసిపుచ్చుతున్న నేపథ్యంలో ఆయా ఆరోపణలకు ఆధారాలను చూపించేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.
కాల్ రికార్డులు, సీఐడీ ఆఫీసు సీసీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీతారామాంజ నేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి అని పేర్కొన్నారు. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారని తెలిపారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారని చెప్పారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారిద్దరూ… జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
This post was last modified on December 30, 2023 3:28 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…