సీఎం జగన్ శుక్రవారం నాడు భీమవరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జగన్ కు విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే వారి సమస్యలను విన్న జగన్ సానుకూలంగా స్పందించారు. వారికి తక్షణ సాయం అందించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ ఆదేశాల ప్రకారం 9 మంది అర్జీదారులకు సాయం అందించామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. భీమవరం ఆర్డీవో కార్యాలయంలో 9 మంది అర్జీదారులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పి. ప్రశాంతి అందించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.9 లక్షలను అందజేశామని వెల్లడించారు.
నరసాపురం మండలం ఎల్ బి చర్ల గ్రామానికి చెందిన కడలి నాగలక్ష్మికి భూ పరిష్కారంలో లక్ష రూపాయల పరిహారం అందజేశారు. నరసాపురానికి చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణకు భర్త చనిపోవడంతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బోడ్డిపట్ల గ్రామానికి చెందిన చిల్లి సుమతికి ఆమె కుమారుడి కిడ్నీ చికిత్స లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
దెందులూరు మండలం కంతేటి దుర్గ భవానికి వైద్య ఖర్చుల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. ఏలూరుకు చెందిన తేతలి గీతకు భర్త మరణించిన కారణంతో, పూళ్ళ గ్రామానికి చెందిన అరుగుల లాజరస్ కు ఆయన కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం, తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతికి వైద్య సహాయం నిమిత్తం, పొలసానపల్లి గ్రామానికి చెందిన కోరాడ వీర వెంకట సత్యనారాయణకు వైద్య ఖర్చులు నిమిత్తం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…