Political News

వ‌ర్మా.. ద‌మ్ముంటే ఈ సినిమాలు తీ: లోకేష్ స‌వాల్‌

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ‘రెడ్‌బుక్‌’ను చేత్తో ప‌ట్టుకుని ప్ర‌సంగాలు చేసిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత కాలంలో ఈ రెడ్ బుక్ చుట్టూ అనే వివాదాలు.. విమ‌ర్శ‌లు.. చోటు చేసుకున్నాయి. ఇటీవ‌ల ఓ కేసులో ఏపీ సీఐడీ ఏకంగా.. రెడ్ బుక్ విష‌యాన్ని నేరుగా హైకోర్టులోనే ప్ర‌స్తావించింది. రెడ్ బుక్ పేరుతో అధికారుల‌ను నారా లోకేష్ బెదిరిస్తున్నార‌ని కోర్టుకు తెలిపింది. ఇలా.. ఇటీవ‌ల కాలంలో నారా లోకేష్ రెడ్ బుక్‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

తాజాగా ఈ రెడ్ బుక్‌పై నారా లోకేష్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో ఎవ‌రెవ‌రి పేర్లు రాస్తున్నామో ఆయ‌న వెల్ల‌డించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్‌బుక్‌లో రాస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. “అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి.. అదే చదువుతా. లేదా సజ్జల వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా” అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వాళ్లు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారా? అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. ఇదిలావుంటే.. తాజాగా రాంగోపాల్ వ‌ర్మ రూపొందించిన వ్యూహం సినిమాపైనా నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “వ్యూహం చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా. ఎన్నికలకు ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారు” అని లోకేష్ అన్నారు.

రాం గోపాల్ వ‌ర్మ‌ నిజంగా సినిమా తీయాలంటే హూకిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్‌లో జరుగుతున్న అవినీతి మీద తీయాల‌ని నారా లోకేష్ స‌వాల్ విసిరారు. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం వైసీపీలో జ‌రుగుతున్న ఇంచార్జ్ ల మార్పుపైనా నారా లోకేష్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లనే వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి బీసీలకు ఇస్తున్నార‌ని అన్నారు.

“మంగళగిరిలో రెండు సార్లు రెడ్ల‌కే టికెట్‌ ఇచ్చారు. ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే బీసీకి ఇచ్చారు. కడప ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వమనండి. పులివెందుల సీటు బీసీలకు ఎందుకివ్వరు?. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనీ చెత్త అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పేశారు. చిలకలూరిపేటకు పనికి రాని విడదల రజనీ గుంటూరు వెస్ట్‌లో ఎలా పనికొస్తారు?” అని లోకేష్ నిల‌దీశారు.

This post was last modified on December 29, 2023 8:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

50 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago