ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాలయాలపై రెపరెపలాడింది. ఆ పార్టీ పట్ల తమ అభిమానం హిమాలయమంత అని యువత చాటుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి చెందిన యువత.. ఇటీవల హిమాలయ పర్వతారోహణం చేశారు. ఈ సందర్భంగా వారు అనేక కష్టాలు పడి(శీతాకాలం కావడంతో) పర్వతాన్ని చేరుకున్నారు.
సాధారణంగా.. ఇలాంటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పుడు దేశభక్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెపరెపలాడించడం పరిపాటి. అయితే..దేశ భక్తితో పాటు తెలుగు దేశం పట్ల ఉన్న అభిమానం కూడా.. వారు చాటుకున్నారు. మిమాలయ పర్వతంపై టీడీపీ జెండాను ఎగరేసి.. పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం జడ్. ఉప్పలపాడుకి చెందిన యువకులు సోమినేని నరేష్, సోమినేని మనోహర్, కోటపాటి శ్రీకాంత్లు హిమాలయ యాత్రకు వెళ్లారు.
ఈ సందర్భంగా వారు తమ వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావుల ఫొటోలతో ముద్రించిన జెండాను తీసుకెళ్లారు. తొలుత హిమాలయం అధిరోహించగానే.. భారత దేశ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. తెలుగు దేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, అధికారంలోకి రావాలని, అదేవిధంగా కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెలవాలని ఆకాక్షించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక, నాగేశ్వరరావు విజయం సాధించాక తిరిగి ఇదే హిమాలయాలపై వేడుక జరుపుకుంటామని వారు తెలిపారు. కాగా, కందుకూరు యువకుల స్ఫూర్తి చూశాక.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలన్న కాక్ష యువతలో ఎంత ఉందో అర్థమవుతోందని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
This post was last modified on December 29, 2023 11:56 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…