Political News

టీడీపీపై ‘హిమాల‌య‌’మంత అభిమానం!!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాల‌యాల‌పై రెప‌రెప‌లాడింది. ఆ పార్టీ ప‌ట్ల త‌మ అభిమానం హిమాల‌య‌మంత అని యువ‌త చాటుకున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యువ‌త‌.. ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వ‌తారోహణం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు అనేక క‌ష్టాలు ప‌డి(శీతాకాలం కావ‌డంతో) ప‌ర్వతాన్ని చేరుకున్నారు.

సాధార‌ణంగా.. ఇలాంటి అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన‌ప్పుడు దేశ‌భ‌క్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెప‌రెప‌లాడించ‌డం ప‌రిపాటి. అయితే..దేశ భ‌క్తితో పాటు తెలుగు దేశం ప‌ట్ల ఉన్న అభిమానం కూడా.. వారు చాటుకున్నారు. మిమాల‌య పర్వ‌తంపై టీడీపీ జెండాను ఎగ‌రేసి.. పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం జడ్‌. ఉప్పలపాడుకి చెందిన యువకులు సోమినేని నరేష్‌, సోమినేని మనోహర్‌, కోటపాటి శ్రీకాంత్‌లు హిమాలయ యాత్ర‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా వారు తమ వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావుల ఫొటోలతో ముద్రించిన జెండాను తీసుకెళ్లారు. తొలుత హిమాల‌యం అధిరోహించ‌గానే.. భారత దేశ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం.. తెలుగు దేశం పార్టీ జెండాను రెప‌రెప‌లాడించారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, అధికారంలోకి రావాల‌ని, అదేవిధంగా కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెల‌వాల‌ని ఆకాక్షించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌, నాగేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించాక తిరిగి ఇదే హిమాలయాలపై వేడుక జరుపుకుంటామని వారు తెలిపారు. కాగా, కందుకూరు యువ‌కుల స్ఫూర్తి చూశాక‌.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్న కాక్ష యువ‌తలో ఎంత ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

This post was last modified on December 29, 2023 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago