Political News

టీడీపీపై ‘హిమాల‌య‌’మంత అభిమానం!!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాల‌యాల‌పై రెప‌రెప‌లాడింది. ఆ పార్టీ ప‌ట్ల త‌మ అభిమానం హిమాల‌య‌మంత అని యువ‌త చాటుకున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యువ‌త‌.. ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వ‌తారోహణం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు అనేక క‌ష్టాలు ప‌డి(శీతాకాలం కావ‌డంతో) ప‌ర్వతాన్ని చేరుకున్నారు.

సాధార‌ణంగా.. ఇలాంటి అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన‌ప్పుడు దేశ‌భ‌క్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెప‌రెప‌లాడించ‌డం ప‌రిపాటి. అయితే..దేశ భ‌క్తితో పాటు తెలుగు దేశం ప‌ట్ల ఉన్న అభిమానం కూడా.. వారు చాటుకున్నారు. మిమాల‌య పర్వ‌తంపై టీడీపీ జెండాను ఎగ‌రేసి.. పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం జడ్‌. ఉప్పలపాడుకి చెందిన యువకులు సోమినేని నరేష్‌, సోమినేని మనోహర్‌, కోటపాటి శ్రీకాంత్‌లు హిమాలయ యాత్ర‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా వారు తమ వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావుల ఫొటోలతో ముద్రించిన జెండాను తీసుకెళ్లారు. తొలుత హిమాల‌యం అధిరోహించ‌గానే.. భారత దేశ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం.. తెలుగు దేశం పార్టీ జెండాను రెప‌రెప‌లాడించారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, అధికారంలోకి రావాల‌ని, అదేవిధంగా కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెల‌వాల‌ని ఆకాక్షించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌, నాగేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించాక తిరిగి ఇదే హిమాలయాలపై వేడుక జరుపుకుంటామని వారు తెలిపారు. కాగా, కందుకూరు యువ‌కుల స్ఫూర్తి చూశాక‌.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్న కాక్ష యువ‌తలో ఎంత ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

This post was last modified on December 29, 2023 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

54 minutes ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

3 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

3 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

4 hours ago

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…

4 hours ago