Political News

టీడీపీపై ‘హిమాల‌య‌’మంత అభిమానం!!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాల‌యాల‌పై రెప‌రెప‌లాడింది. ఆ పార్టీ ప‌ట్ల త‌మ అభిమానం హిమాల‌య‌మంత అని యువ‌త చాటుకున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యువ‌త‌.. ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వ‌తారోహణం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు అనేక క‌ష్టాలు ప‌డి(శీతాకాలం కావ‌డంతో) ప‌ర్వతాన్ని చేరుకున్నారు.

సాధార‌ణంగా.. ఇలాంటి అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన‌ప్పుడు దేశ‌భ‌క్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెప‌రెప‌లాడించ‌డం ప‌రిపాటి. అయితే..దేశ భ‌క్తితో పాటు తెలుగు దేశం ప‌ట్ల ఉన్న అభిమానం కూడా.. వారు చాటుకున్నారు. మిమాల‌య పర్వ‌తంపై టీడీపీ జెండాను ఎగ‌రేసి.. పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం జడ్‌. ఉప్పలపాడుకి చెందిన యువకులు సోమినేని నరేష్‌, సోమినేని మనోహర్‌, కోటపాటి శ్రీకాంత్‌లు హిమాలయ యాత్ర‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా వారు తమ వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావుల ఫొటోలతో ముద్రించిన జెండాను తీసుకెళ్లారు. తొలుత హిమాల‌యం అధిరోహించ‌గానే.. భారత దేశ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం.. తెలుగు దేశం పార్టీ జెండాను రెప‌రెప‌లాడించారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, అధికారంలోకి రావాల‌ని, అదేవిధంగా కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెల‌వాల‌ని ఆకాక్షించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌, నాగేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించాక తిరిగి ఇదే హిమాలయాలపై వేడుక జరుపుకుంటామని వారు తెలిపారు. కాగా, కందుకూరు యువ‌కుల స్ఫూర్తి చూశాక‌.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్న కాక్ష యువ‌తలో ఎంత ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

This post was last modified on December 29, 2023 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

10 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

22 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago