ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాలయాలపై రెపరెపలాడింది. ఆ పార్టీ పట్ల తమ అభిమానం హిమాలయమంత అని యువత చాటుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి చెందిన యువత.. ఇటీవల హిమాలయ పర్వతారోహణం చేశారు. ఈ సందర్భంగా వారు అనేక కష్టాలు పడి(శీతాకాలం కావడంతో) పర్వతాన్ని చేరుకున్నారు.
సాధారణంగా.. ఇలాంటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పుడు దేశభక్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెపరెపలాడించడం పరిపాటి. అయితే..దేశ భక్తితో పాటు తెలుగు దేశం పట్ల ఉన్న అభిమానం కూడా.. వారు చాటుకున్నారు. మిమాలయ పర్వతంపై టీడీపీ జెండాను ఎగరేసి.. పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం జడ్. ఉప్పలపాడుకి చెందిన యువకులు సోమినేని నరేష్, సోమినేని మనోహర్, కోటపాటి శ్రీకాంత్లు హిమాలయ యాత్రకు వెళ్లారు.
ఈ సందర్భంగా వారు తమ వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావుల ఫొటోలతో ముద్రించిన జెండాను తీసుకెళ్లారు. తొలుత హిమాలయం అధిరోహించగానే.. భారత దేశ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. తెలుగు దేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, అధికారంలోకి రావాలని, అదేవిధంగా కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెలవాలని ఆకాక్షించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక, నాగేశ్వరరావు విజయం సాధించాక తిరిగి ఇదే హిమాలయాలపై వేడుక జరుపుకుంటామని వారు తెలిపారు. కాగా, కందుకూరు యువకుల స్ఫూర్తి చూశాక.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలన్న కాక్ష యువతలో ఎంత ఉందో అర్థమవుతోందని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
This post was last modified on December 29, 2023 11:56 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…