భారత క్రికెటర్.. గుంటూరుకు చెందిన అంబటి రాయుడు.. కేవలం బ్యాటింగ్ రాయుడే కాదు.. మాటల రాయుడు అని కూడా నిరూపించేసుకున్నాడు. వైసీపీలో ఇలా చేరాడో లేదో అలా.. నోటికి, మాటలకు పని చెప్పేశారు. తాజాగా గురువారం సాయంత్రం వైసీపీ కండువా కప్పుకొన్న రాయుడు.. ఆ పార్టీలోకి అధికారి కంగా చేరిన విషయం తెలిసిందే. సహజంగా అయితే.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, లేదా.. కనీసంలో కనీసం ఓ పదేళ్ల హిస్టరీ ఉన్న నాయకులైతే.. ఇలా పార్టీ మారగానే అలా ప్రత్యర్థులపై విమర్శలు చేసేస్తారు.
కానీ, రాయుడుకు ఇప్పటి వరకు బ్యాటింగ్, బౌలింగ్ అనుభవమే తప్ప.. రాజకీయ అనుభవం లేదు. అయినా.. కూడా నేనేం తక్కువ అనుకున్నాడో.. వైసీపీలో ఇలా ఉండకపోతే.. ఎలా అనుకున్నాడో తెలియదు కానీ.. వెంటనే నోటికి పనిచెప్పారు. ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డాడు. అది కూడా.. ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే విమర్శలు గుప్పించాడు. దీంతో అంబటి రాయుడు కాదు.. మాటల రాయుడు అనే టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ రాయుడు ఏమన్నాడంటే.. “ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తోంది అయితే.. ఇలా సంక్షేమ పథకాలను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రం ఏమైపోతుంది? అప్పులు చేసి మరీ పంచేస్తే.. ఎలా? అంటూ టీడీపీ జనసేన విమర్శలు గుప్పించాయి. మరి ఆ పార్టీలు కూడా ఇప్పు డు ఎన్నికల వేళ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి కదా? మరి అప్పుడు ఏమనాలి? ” అని రాయుడు ప్రశ్నించారు.
అంతేకాదు.. అధికార పక్షం ఏం చేస్తోందో.. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో.. ప్రజలు అన్నీ గమనిస్తున్నా రని .. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో వారికి బాగా తెలుసునని రాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన తాను.. ఆ ప్రాంత సంక్షేమం కోసం.. పనిచేస్తానని వెల్లడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో రాయుడిని అసెంబ్లీ బరిలో నిలబెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలుచెబుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.
This post was last modified on December 29, 2023 11:44 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…