భారత క్రికెటర్.. గుంటూరుకు చెందిన అంబటి రాయుడు.. కేవలం బ్యాటింగ్ రాయుడే కాదు.. మాటల రాయుడు అని కూడా నిరూపించేసుకున్నాడు. వైసీపీలో ఇలా చేరాడో లేదో అలా.. నోటికి, మాటలకు పని చెప్పేశారు. తాజాగా గురువారం సాయంత్రం వైసీపీ కండువా కప్పుకొన్న రాయుడు.. ఆ పార్టీలోకి అధికారి కంగా చేరిన విషయం తెలిసిందే. సహజంగా అయితే.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, లేదా.. కనీసంలో కనీసం ఓ పదేళ్ల హిస్టరీ ఉన్న నాయకులైతే.. ఇలా పార్టీ మారగానే అలా ప్రత్యర్థులపై విమర్శలు చేసేస్తారు.
కానీ, రాయుడుకు ఇప్పటి వరకు బ్యాటింగ్, బౌలింగ్ అనుభవమే తప్ప.. రాజకీయ అనుభవం లేదు. అయినా.. కూడా నేనేం తక్కువ అనుకున్నాడో.. వైసీపీలో ఇలా ఉండకపోతే.. ఎలా అనుకున్నాడో తెలియదు కానీ.. వెంటనే నోటికి పనిచెప్పారు. ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డాడు. అది కూడా.. ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే విమర్శలు గుప్పించాడు. దీంతో అంబటి రాయుడు కాదు.. మాటల రాయుడు అనే టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ రాయుడు ఏమన్నాడంటే.. “ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తోంది అయితే.. ఇలా సంక్షేమ పథకాలను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రం ఏమైపోతుంది? అప్పులు చేసి మరీ పంచేస్తే.. ఎలా? అంటూ టీడీపీ జనసేన విమర్శలు గుప్పించాయి. మరి ఆ పార్టీలు కూడా ఇప్పు డు ఎన్నికల వేళ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి కదా? మరి అప్పుడు ఏమనాలి? ” అని రాయుడు ప్రశ్నించారు.
అంతేకాదు.. అధికార పక్షం ఏం చేస్తోందో.. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో.. ప్రజలు అన్నీ గమనిస్తున్నా రని .. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో వారికి బాగా తెలుసునని రాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన తాను.. ఆ ప్రాంత సంక్షేమం కోసం.. పనిచేస్తానని వెల్లడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో రాయుడిని అసెంబ్లీ బరిలో నిలబెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలుచెబుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.
This post was last modified on December 29, 2023 11:44 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…