భారత క్రికెటర్.. గుంటూరుకు చెందిన అంబటి రాయుడు.. కేవలం బ్యాటింగ్ రాయుడే కాదు.. మాటల రాయుడు అని కూడా నిరూపించేసుకున్నాడు. వైసీపీలో ఇలా చేరాడో లేదో అలా.. నోటికి, మాటలకు పని చెప్పేశారు. తాజాగా గురువారం సాయంత్రం వైసీపీ కండువా కప్పుకొన్న రాయుడు.. ఆ పార్టీలోకి అధికారి కంగా చేరిన విషయం తెలిసిందే. సహజంగా అయితే.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, లేదా.. కనీసంలో కనీసం ఓ పదేళ్ల హిస్టరీ ఉన్న నాయకులైతే.. ఇలా పార్టీ మారగానే అలా ప్రత్యర్థులపై విమర్శలు చేసేస్తారు.
కానీ, రాయుడుకు ఇప్పటి వరకు బ్యాటింగ్, బౌలింగ్ అనుభవమే తప్ప.. రాజకీయ అనుభవం లేదు. అయినా.. కూడా నేనేం తక్కువ అనుకున్నాడో.. వైసీపీలో ఇలా ఉండకపోతే.. ఎలా అనుకున్నాడో తెలియదు కానీ.. వెంటనే నోటికి పనిచెప్పారు. ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డాడు. అది కూడా.. ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే విమర్శలు గుప్పించాడు. దీంతో అంబటి రాయుడు కాదు.. మాటల రాయుడు అనే టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ రాయుడు ఏమన్నాడంటే.. “ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తోంది అయితే.. ఇలా సంక్షేమ పథకాలను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రం ఏమైపోతుంది? అప్పులు చేసి మరీ పంచేస్తే.. ఎలా? అంటూ టీడీపీ జనసేన విమర్శలు గుప్పించాయి. మరి ఆ పార్టీలు కూడా ఇప్పు డు ఎన్నికల వేళ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి కదా? మరి అప్పుడు ఏమనాలి? ” అని రాయుడు ప్రశ్నించారు.
అంతేకాదు.. అధికార పక్షం ఏం చేస్తోందో.. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో.. ప్రజలు అన్నీ గమనిస్తున్నా రని .. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో వారికి బాగా తెలుసునని రాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన తాను.. ఆ ప్రాంత సంక్షేమం కోసం.. పనిచేస్తానని వెల్లడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో రాయుడిని అసెంబ్లీ బరిలో నిలబెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలుచెబుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…