టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు రోజుకో రకమైన ట్విస్ట్ ఇస్తున్నాయి. రెండు రోజుల కిందట జాతీయ రాజకీయాల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)తో భేటీ అయిన చంద్రబాబు రాజకీయాలను సలసల మరిగేలా చేశారు. దీనిపై అనేక వందల విశ్లేషణలు.. చర్చలు.. వార్తలు వచ్చాయి. ఈ వేడి తగ్గకముందే.. ఇప్పుడు మరో సంచలనం చోటు చేసుకుంది.
ప్రస్తుతం కర్ణాటకలో పర్యటించిన చంద్రబాబు.. అక్కడి బెంగళూరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. అనంతరం తిరిగి తన సొంత జిల్లా ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి బయలు దేరారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి రేణిగుంటకు వచ్చేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. ఈ సమయంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, షార్ప్ షూటర్, డిప్యూటీ సీఎం కే. శివకుమార్ తారసపడ్డారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కకు వెళ్లి మరీ చర్చించుకోవడం గమనార్హం. గతంలో 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేసినప్పుడు డీకే శివకుమార్ ప్రచారం చేశారు. మళ్లీ ఆతర్వాత.. చంద్రబాబుతో ఆయన కనిపించలేదు.
ఇక, ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబుతో డీకే ఎదురు పడడం.. ఇద్దరూ ఏకాంతంగా విమానాశ్రయం రన్వేపైనే చర్చలు జరపడం ఉత్కంఠకు దారి తీశాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బలపడాలని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఏం చర్చించుకున్నారు? ఏంటి కథ తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…