Political News

కుప్పం.. పెద్ద టార్గెట్టే పెట్టుకున్నరు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించాల‌ని అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, కానీ, ఆ పప్పులేవీ ఉడ‌క‌వ‌ని.. తాను ల‌క్ష ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కుప్పం ప్ర‌జ‌లు త‌న‌తోనే ఉన్నార‌ని బాబు వెల్ల‌డించారు. తాజాగా బెంగ‌ళూరు నుంచి కుప్పం చేరుకున్న ఆయ‌న మూడు రోజుల పాటు ఇక్క‌డే బ‌స చేసి.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్నారు.

కుప్పం వ‌చ్చిన చంద్ర‌బాబు తొలుత‌.. గుడుప‌ల్లిలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. వైసీపీ అధినేత‌, సీఎం జగన్ మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడని విరుచుకుపడ్డారు. కుప్పంలో రౌడీయిజం, భూదం దాలు ఎక్కువయ్యాయని, తాను అధికారంలోకి రాగానే ఎవ‌రిని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డే ఉంచుతాన‌ని అన్నారు. జగన్ అండతో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తాట తీస్తాన‌ని చెప్పారు. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని, తమ ప్రభుత్వం ఏర్పడగానే రౌడీలను అణిచివేస్తామని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి రాగానే 10 లక్షల లీటర్ల పాలును ఉత్పత్తి చేసే పరిశ్రమను తీసుకొస్తామని చంద్రబా బు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్(ఆరు గ్యారెంటీలు) అర్హులైన‌ అందరికీ అమలయ్యేలా తాను మాటిస్తు న్నానన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి సంవత్సరానికి గాను రూ.15,000 ఇస్తామన్నారు. తామిచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ తెస్తామని వైసీపీ వాళ్లు హామీ ఇచ్చారని, మరి ఆ క్యాలెండర్ వచ్చిందా? అని నిల‌దీశారు.

కుప్పంలో త‌న‌ను ఓడిస్తాన‌ని శ‌ప‌థం చేసిన‌ వైసీపీ నాయకులు ఏమీ చేయలేకపోయారని తూర్పారప ట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే బాధ్యతని తాను తీసుకుంటానని, నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 తప్పకుండా ఇస్తానని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని మాటిచ్చారు. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరి భవిష్యత్తుని మెరుగుపరుస్తానని చెప్పారు. ఇక్క‌డ చూస్తున్న ప్ర‌జ‌ల‌ను చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాకు ల‌క్ష ఓట్ల మెజారిటీ ఖాయ‌మ‌ని అనిపిస్తోంది అని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు.

This post was last modified on December 29, 2023 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago