భారత క్రికెటర్, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు.. ఏపీ అధికార పార్టీవైసీపీలో చేరారు. రాయుడిని సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పారు. ఈ సందర్భంగా క్రికెటర్ రాయుడు మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు. తొలి నుంచి తనకు సీఎం జగన్ పై నమ్మకం ఉందని, కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.
జగన్ పాలన చాలా పారదర్శకంగా ఉందని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, నాలుగు మాసాల కిందటే రాయుడు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. ఆయనను అప్పట్లోనే ఆడుదాం ఆంధ్ర ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఎంపిక కూడా చేసింది. ఇక, గ్రామాల్లో పర్యటించిన రాయుడు.. పింఛన్లు సమయానికి అందడం.. వలంటీర్ల సేవలు, సచివాలయాల ఏర్పాటు వంటి అనే విషయాలను పరిశీలించారు. ఈ సమయంలో జగన్ పాలనపై ప్రశంసలు గుప్పించారు.
ఆ తర్వాత ఎందుకో అనూహ్యంగా నాలుగు మాసాల గ్యాప్ వచ్చింది. దీంతో రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ ప్రారంభమైంది. తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. రాజకీయ వ్యాఖ్యలకు కూడా స్పందించలేదు. మరోవైపు.. తాజగా రెండు రోజుల కిందట సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కూడా అంబటి రాలేదు. దీంతో ఆయన వైసీపీ ఇక, దూరమేనని అందరూ అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా.. అంబటి సీఎం కార్యాలయానికి వెళ్లే వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. అత్యంత రహస్యంగా రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం(సత్తెనపల్లి/ నరసారావు పేట) కేటాయించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 28, 2023 9:08 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…