భారత క్రికెటర్, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు.. ఏపీ అధికార పార్టీవైసీపీలో చేరారు. రాయుడిని సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పారు. ఈ సందర్భంగా క్రికెటర్ రాయుడు మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు. తొలి నుంచి తనకు సీఎం జగన్ పై నమ్మకం ఉందని, కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.
జగన్ పాలన చాలా పారదర్శకంగా ఉందని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, నాలుగు మాసాల కిందటే రాయుడు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. ఆయనను అప్పట్లోనే ఆడుదాం ఆంధ్ర ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఎంపిక కూడా చేసింది. ఇక, గ్రామాల్లో పర్యటించిన రాయుడు.. పింఛన్లు సమయానికి అందడం.. వలంటీర్ల సేవలు, సచివాలయాల ఏర్పాటు వంటి అనే విషయాలను పరిశీలించారు. ఈ సమయంలో జగన్ పాలనపై ప్రశంసలు గుప్పించారు.
ఆ తర్వాత ఎందుకో అనూహ్యంగా నాలుగు మాసాల గ్యాప్ వచ్చింది. దీంతో రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ ప్రారంభమైంది. తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. రాజకీయ వ్యాఖ్యలకు కూడా స్పందించలేదు. మరోవైపు.. తాజగా రెండు రోజుల కిందట సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కూడా అంబటి రాలేదు. దీంతో ఆయన వైసీపీ ఇక, దూరమేనని అందరూ అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా.. అంబటి సీఎం కార్యాలయానికి వెళ్లే వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. అత్యంత రహస్యంగా రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం(సత్తెనపల్లి/ నరసారావు పేట) కేటాయించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 28, 2023 9:08 pm
వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొడతాడని సంక్రాంతికి వస్తున్నాంలో ఉపేంద్ర లిమయే చెప్పిన డైలాగ్…
ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన గజిని మూవీ లవర్స్ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్. సూర్య కెరీర్ ని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన సూపర్…
వరస ఫ్లాపులతో సతమవుతున్నప్పుడు యూత్ హీరో కిరణ్ అబ్బవరంకు 'క' ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా మార్కెట్ ని…
రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నవ శకానికి నాందీ పలికారు. నిన్నటిదాకా రాజకీయం…
ఏపీలో రాజకీయం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు కాగా… ఆ విస్తుగొలిపే ఫలితాలకు అనుగుణంగానే…