భారత క్రికెటర్, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు.. ఏపీ అధికార పార్టీవైసీపీలో చేరారు. రాయుడిని సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పారు. ఈ సందర్భంగా క్రికెటర్ రాయుడు మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు. తొలి నుంచి తనకు సీఎం జగన్ పై నమ్మకం ఉందని, కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.
జగన్ పాలన చాలా పారదర్శకంగా ఉందని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, నాలుగు మాసాల కిందటే రాయుడు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. ఆయనను అప్పట్లోనే ఆడుదాం ఆంధ్ర ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఎంపిక కూడా చేసింది. ఇక, గ్రామాల్లో పర్యటించిన రాయుడు.. పింఛన్లు సమయానికి అందడం.. వలంటీర్ల సేవలు, సచివాలయాల ఏర్పాటు వంటి అనే విషయాలను పరిశీలించారు. ఈ సమయంలో జగన్ పాలనపై ప్రశంసలు గుప్పించారు.
ఆ తర్వాత ఎందుకో అనూహ్యంగా నాలుగు మాసాల గ్యాప్ వచ్చింది. దీంతో రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ ప్రారంభమైంది. తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. రాజకీయ వ్యాఖ్యలకు కూడా స్పందించలేదు. మరోవైపు.. తాజగా రెండు రోజుల కిందట సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కూడా అంబటి రాలేదు. దీంతో ఆయన వైసీపీ ఇక, దూరమేనని అందరూ అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా.. అంబటి సీఎం కార్యాలయానికి వెళ్లే వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. అత్యంత రహస్యంగా రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం(సత్తెనపల్లి/ నరసారావు పేట) కేటాయించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 28, 2023 9:08 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…