ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ మరో ఛాన్స్ దక్కించు కుంటుందా? లేక పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని భావిస్తున్న టీడీపీ-జనసేనలు ఉమ్మడిగా అధికారం సాధిస్తాయా? పొత్తు ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇదీ.. కొన్నాళ్లుగా రాజకీయంగా జరుగుతున్న తీవ్రమైన చర్చ. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇటు పొత్తు, అటు ఒంటరి(వైసీపీ) పోటీపై అనేక అంచనాలు వస్తున్నాయి.
సాధారణంగా ఒక పార్టీకి మరో పార్టీ జత కడితే.. అంచనాలు భిన్నంగానే ఉంటాయని అందరూ భావిస్తారు. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి నేతలు..తమదే అధికారమని చెబుతున్నారు. ఇంకోవైపు వైసీపీ మంత్రులు, నాయకులు ఎవరు ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. అధికారం జగన్కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జననేతగా ఆయనను ఢీకొట్టే వారు లేరని కూడా చెబుతున్నారు. అయితే.. ఈ చర్చ కొనసాగుతున్న సమయంలోనే తాజాగా ఓ సంచలన సర్వే తెరమీదికి వచ్చింది.
అదే.. “జన్ మాట” పోల్ సర్వే. ఈ సర్వేకు చాలా విశ్వసనీయత ఉండడం గమనార్హం. ముందుగా ఇది చేసిన సర్వే గురించి చెప్పుకొందాం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక సర్వేలు వచ్చాయి. అన్ని సర్వేలు కూడా.. కాంగ్రెస్కు మెజారిటీ మార్కుకు దిగువన 60 లేదా 57 సీట్లు మాత్రమే దక్కుతాయని అన్నారు. మరికొన్ని బీఆర్ ఎస్కు ఏకపక్షంగా వస్తాయని చెప్పాయి. కానీ, జన్ మాట సర్వే మాత్రం కాంగ్రెస్కు 61-63 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఈ సంస్థ చెప్పినట్టే కాంగ్రెస్ కు మరో సీటు ఎక్కువగా 64 స్థానాలు దక్కాయి. దీంతో ఎలాంటి శషభిషలు లేకుండానే కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇక, బీఆర్ ఎస్కు 45-47 వస్తాయని పేర్కొనగా 34 సీట్లకే పరిమితమైంది. బీజేపీకి 4-5 వస్తాయని చెప్పగా 8, ఎంఐఎంకు 6-7 స్థానాలని పేర్కొనగా.. 6 చోట్ల విజయందక్కించుకుంది. సో.. దీనిని బట్టి జన్ మాట సర్వేకు విశ్వసనీయత బాగా పెరిగింది.
ఇప్పుడు ఇదే జన్ మాట .. సర్వే.. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించాక.. ఏపీలో సర్వే చేసింది. 2024లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం..
2024 ఎన్నికలలో
116-118 సీట్లలో వైసీపీ గెలవనుంది
46-48 సీట్లను టీడీపీ+జనసేన కైవసం చేసుకోనున్నాయి. సో.. దీనిని బట్టి.. ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగానే తెలంగాణ ఫలితాలు కూడా వచ్చాయి కనుక.. రానున్న 2024లో ఏపీలో వైసీపీ మరోసారి విజయఢంకా మోగించడం.. జగనే సీఎం కావడం.. సరికొత్త రికార్డు సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…