Political News

వైసీపీలో మారిన ‘వ‌సంత’ గానం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపు వ్య‌వ‌హారంపై ఏపీ అధికార పార్టీలో కీల‌క‌చ‌ర్చ‌గా మారింది. కొంద‌రిని తీసేయ‌డం.. మ‌రికొంద‌రిని చేర్చ‌డం వంటివి ఆస‌క్తిగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు నొచ్చుకుంటుండగా.. మ‌రికొంద‌రు స‌ర్దుకుపోతున్నారు. ఇలాంటివారిలో మైల‌వరం ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్ కూడా ఉన్నారు. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండానే.. లేదా ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌కుండానే.. “నేను పోటీ చేయ‌ను” అని ప్ర‌క‌టించారు. ఈ ఆకస్మిక వ‌సంత గానం మార్పుపై పార్టీలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది

2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న వ‌సంత కృష్ణ ప్ర‌సాద్.. మైల‌వ‌రం టికెట్ ఆశించారు. దీనికి టీడీపీ ససేమిరా అన‌డంతో అప్ప‌టిక‌ప్పుడు వైసీపీలోకి వ‌చ్చారు. మొత్తానికి టికెట్ ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ సునామీ, పాద‌యాత్ర ప్ర‌భావంతో విజ‌యం ద‌క్కించుకున్నార‌నే టాక్ ఉంది. ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. సొంత సామాజిక వ‌ర్గ‌మే ఆయ‌న‌కు దూర‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని కాద‌ని.. వ‌సంత‌కు జై కొట్టిన క‌మ్మ వ‌ర్గం.. ఇప్పుడు పూర్తిగా ఆయ‌న‌ను దూరం పెట్టింది.

ఈ విష‌యంలో పార్టీకంటే కూడా.. వ‌సంత వైపే త‌ప్పులు క‌నిపిస్తున్నాయ‌నే చ‌ర్చ ఉంది. త‌న‌ను గెలిపించిన వారిని క‌నీసం ఆద‌రించ‌కుండా.. వైరి ప‌క్షం టీడీపీ నేత‌ల‌తో ఆయ‌న చేతులు క‌లిపార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో సొంత పార్టీ నాయ‌కుల‌తోనూ ఆయ‌న క‌య్యాల‌కు దిగ‌డం.. చీటికీ మాటికీ.. పంచాయ‌తీలు పెట్టుకోవ‌డం వంటివి వ్య‌క్తిగతంగా వ‌సంత‌కు మైన‌స్ మార్కులు ప‌డేలా చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు టికెట్ రాద‌నే ప్ర‌చారం ఉంది.

అయితే. ఈ విష‌యాన్ని పార్టీ అధిష్టానం ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. ఇస్తామ‌ని, ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌లేదు. కానీ, ఇంత‌లోనే వ‌సంత త‌న స్వ‌రం మార్చుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని.. ఇటీవ‌ల రెండు సార్లు ప్ర‌క‌టించుకున్నారు. అయితే.. ఇది వ్యూహాత్మకంగా చేసిన వాద‌నేన‌ని కొంద‌రు చెబుతున్నా రు. ఇలా పోటీకి దూర‌మ‌వుతున్నాన‌ని చెప్ప‌డం ద్వారా సింప‌తీ గెయిన్ పాలిటిక్స్ ఉన్నాయ‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మైల‌వ‌రం టికెట్‌ను వ‌సంత‌కే వైసీపీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌నుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on December 28, 2023 9:05 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago