వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆదిశగా ఇప్పుడు వ్యూహానికి మరింత పదును పెంచారు. ఇప్పటి వరకు సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీ, వ్యూహకర్తలు, ప్రధాన కార్యదర్శులు, అదికార ప్రతినిధులుగా ఉన్న సైన్యాన్ని మాత్రమే రంగంలోకి దింపుతున్నారు. అయితే. ఇప్పుడు ఐటీ సైన్యాన్ని సైతం ఎన్నికలకు వినియోగించుకునేందుకురెడీ అయ్యారు. ఐటీ సైన్యం అంటే.. ఎవరో కాదు చంద్రబాబు చేత, చంద్రబాబు వలన ఐటీ విద్యను అభ్యసించిన వారే.
వారిలోనూ టీడీపీ అన్నా..చంద్రబాబు అన్నా సింపతీ చూపించేవారినే తాజాగా చంద్రబాబు ఐటీ సైన్యంగా పేర్కొన్నారు. తాజాగా బెంగళూరులో పర్యటించిన చంద్రబాబుకు అక్కడి ఐటీ ఉద్యోగుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ని బాగు చేసేందుకు మీరు ఏం చేయగలరో ప్లాన్ చేయండి. వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అదేసమయంలో చంద్రబాబు ఐటీ ఉద్యోగులకు మరో టార్గెట్ కూడా పెట్టారు. ఉద్యోగులు సంపాయిస్తు న్న వేతనంలో నూటికి 5 రూపాయలు ఎన్నికల సమయంలో సమాజం కోసం ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు. “సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం నేను కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చేసే పనులు తర తరాల కోసమే. వారి అభ్యున్నతి కోసమే. వారు గుర్తుపెట్టుకోవాలి. చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ దన్యమైనట్లే” అని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on December 28, 2023 5:17 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…