Political News

జిల్లాల మ్యాప్ మార్చనున్న సీఎం రేవంత్ ?

కేసీయార్ హయాంలో ఏర్పాటైన జిల్లాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమీక్షకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ తొందరలోనే జారీ అవబోతోందని అధికారవర్గాలు చెప్పాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పడేనాటికి పది జిల్లాలు మాత్రమే ఉండేవి. వాటిని కేసీయార్ ముందు 31 జిల్లాలుగా విభజించారు. తర్వాత మరో రెండు జిల్లాలను చేర్చి మొత్తం 33 జిల్లాలుగా చేశారు. అయితే మొదట్లో 31 జిల్లాలు చేసినా తర్వాత 33 జిల్లాలుగా మార్చినా అందులో ఎలాంటి శాస్త్రీయతా లేదు. తనిష్టం వచ్చినట్లు చేసుకున్నారు.

దాంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా కేసీయార్ ఎవరినీ లెక్కచేయకుండా తనిష్ట ప్రకారమే జిల్లాలను విడదీసేశారు. జిల్లాల విభజనలో ఒక పద్దతి పాడు లేకుండా పోయింది. ఒకే నియోజకవర్గం ఇపుడు మూడు జిల్లాల్లో ఉంది. అలాగే రెండే నియోజకవర్గాలతో సిరిసిల్ల జిల్లా ఏర్పాటైంది. కొడుకు కేటీయార్ కోసమే ఈ జిల్లా ఏర్పాటైందనే ఆరోపణలకు కొదవలేదు. ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటుచేయటంతో ఇప్పటికీ చాలా జిల్లాల్లో అధికారయంత్రాంగం లేదు.

ఇలాంటి సమస్యలను గుర్తించి జిల్లాలను భౌగోళిక, జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసం రిటైర్డ్ జిడ్జి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికగా, భౌగోళిక స్వరూపాన్ని అనుసరించి జిల్లాలను సర్దుబాబు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతోంది. పనిలోపనిగా జనాభిప్రాయాన్ని కూడా సేకరించాలని కూడా అనుకున్నది. కేసీయార్ హయాంలో ఇలాంటి శాస్త్రీయ పద్దతులను అనుసరించలేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

తొందరలో జరగబోబోతోందని అనుకుంటున్న జిల్లాల సర్దుబాటులో ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలోనే ఉంటుందన్నది కీలకమైనది. ఇపుడు రెండు నియోజకవర్గాలకు ఒక జిల్లా, ఏడు నియోజకవర్గాలకు మరో జిల్లాగా ఏర్పాటైంది. ఇలా ఎందుకు ఏర్పాటైందంటే అందుకు కేసీయార్ ఆలోచనలే కారణమనే ఆరోపణలకు కొదవలేదు. ఒక రకంగా జిల్లాల స్వరూపాన్ని కేసీయార్ అడ్డదిడ్డంగా మార్చేశారు. దాంతో మామూలు జనాలే కాదు అధికారయంత్రాంగం కూడా బాగా ఇబ్బంది పడుతోంది. అయినా కేసీయార్ ఎవరినీ పట్టించుకోలేదు.

This post was last modified on December 28, 2023 10:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

3 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

4 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

5 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

5 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

5 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago