రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పథకం అమలుకు అప్పర్ లిమిట్ సీలింగ్ విధించాలని అనుకుంటున్నదట. రైతుబంధు పథకం అమలుపై సమీక్షించిన తర్వాతనే రైతుభరోసా నిధులు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 2018లో కేసీయార్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకంలో చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పథకంలో అనర్హులకు కూడా చాలా లబ్ది జరిగిందని వచ్చిన ఆరోపణలను కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అలాంటి ఆరోపణలను, ఇతరత్రా పీడ్ బ్యాక్ ను రేవంత్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అందుకనే సమీక్షల మీద సమీక్షలు చేస్తోంది. నిజానికి రైతుబంధు పథకంలో అర్హులతో పాటు అనర్హులకు కూడా లబ్దికలుగుతోందన్నది వాస్తవం. పైగా కౌలు రైతులు, బక్క రైతులను కేసీయార్ ప్రభుత్వం అసలు పట్టించుకోనేలేదు. కౌలు రైతులను అప్పటి ప్రభుత్వం అసలు రైతులగానే గుర్తించలేదు. విచిత్రం ఏమిటంటే రైతుబంధు పథకంలో పెద్ద పెద్ద భూస్వాములు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాదికారులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కూడా లబ్దిపొందారు.
ఊర్లలో తమ భూములను కౌలుకు ఇచ్చేసి హైదరాబాద్ లో స్ధిరపడిన వారికి కూడా రైతుబంధు పథకంలో బాగా లబ్దిజరిగింది. అలాంటి వ్యవహారాలకు ఫులిస్టాప్ పెట్టి నిజమైన అర్హులు ఎవరు ? అనర్హులు ఎవరు అన్న విషయాలను సమగ్రంగా తేల్చాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసం గ్రామసభలు కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. గ్రామసభల్లోనే అర్హులెవరు, అనర్హులెవరు అన్న విషయాలు చాలావరకు తేలిపోతుంది.
పనిలోపనిగా రైతుల నుండి కూడా అభిప్రాయాలు తీసుకుని గ్రామసభల్లో సదరు రైతుల భూముల విస్తీర్ణం, ఎంతకాలంగా సాగుచేస్తున్నారు ? భూ యజమానులు ఎవరు అన్న విషయాలను ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో పథకంలో లబ్దిపొందుతున్న అనర్హులు ఎవరనే విషయం చాలావరకు తేలిపోతుంది. కేసీయార్ ప్రభుత్వం ఇలాంటి అధ్యయనం ఏమీ చేయకుండానే పథకాన్ని అమలు చేసేసింది. సో రేవంత్ ప్రభుత్వం చేయబోతున్న మార్పుల కారణంగా నిజమైన అర్హులెవరో తేలిన తర్వాతే రైతుభరోసా నిధులను విడుదల చేయాలని డిసైడ్ అయ్యింది.
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
శివ, క్షణక్షణం, సత్య, రంగీలా లాంటి సినిమాలతో కల్ట్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫామ్ తగ్గిపోయిన…
తెలుగులో దసరా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. తెర మీద ఎక్కువగా అదో…
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.…