ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం గుంటూరులో ప్రారంభించారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఔత్సాహిక కళాకారులను ఎంపిక చేసి క్రీడా పరికరాలతో కూడిన కిట్లను వారికి పంపిణీ చేశారు. ఇది కూడా జిల్లాల్లోనూ పంపిణీ చేశారు. ఈ కిట్లో క్రికెట్ బ్యాటు, చేతులకు, కాళ్లకు ధరించే రక్షణ పరికరాలు, టెన్సిస్ ర్యాకెట్, కప్లు ఇలా.. 7 రకాల క్రీడలకు సంబంధించిన పరికరాలను పంపిణీ చేశారు.
అయితే.. వీటిలో ఎక్కువగా ఆకర్షించినవి క్రికెట్ బ్యాట్లు. ఎక్కువ మంది క్రీడా కారులకు ఈ కిట్లు కూడా పంపిణీ చేశారు. అయితే.. తొలి రోజే చాలా జిల్లాల్లో ఈ బ్యాట్లు తొలి మ్చాచ్లోనే విరిగి పోవడం గమనార్హం. దీంతో క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విరిగిపోయిన బ్యాట్లను ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఎంతో కష్టపడి రూపొందించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలి, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన కిట్ల తయారీ, పంపిణీపై శాప్ కొన్ని నెలల ముందుగానే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ఓ సంస్థకు ఈ పరికరాలు అందించే టెండర్ను కట్టబెట్టారు. అయితే.. అప్పట్లోనే ఈ సంస్థ పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ శాప్ ఆ కంపెనీకే టెండర్ ఇచ్చేసింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన క్రీడా పరికరాలను మూడు దశల్లో అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే.. తొలి దశలో పంపిణీ చేసిన పరికరాల్లో నాసిరకమైనవి రావడంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గురయ్యారు.
This post was last modified on December 27, 2023 10:26 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…