ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర
క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం గుంటూరులో ప్రారంభించారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఔత్సాహిక కళాకారులను ఎంపిక చేసి క్రీడా పరికరాలతో కూడిన కిట్లను వారికి పంపిణీ చేశారు. ఇది కూడా జిల్లాల్లోనూ పంపిణీ చేశారు. ఈ కిట్లో క్రికెట్ బ్యాటు, చేతులకు, కాళ్లకు ధరించే రక్షణ పరికరాలు, టెన్సిస్ ర్యాకెట్, కప్లు ఇలా.. 7 రకాల క్రీడలకు సంబంధించిన పరికరాలను పంపిణీ చేశారు.
అయితే.. వీటిలో ఎక్కువగా ఆకర్షించినవి క్రికెట్ బ్యాట్లు. ఎక్కువ మంది క్రీడా కారులకు ఈ కిట్లు కూడా పంపిణీ చేశారు. అయితే.. తొలి రోజే చాలా జిల్లాల్లో ఈ బ్యాట్లు తొలి మ్చాచ్లోనే విరిగి పోవడం గమనార్హం. దీంతో క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విరిగిపోయిన బ్యాట్లను ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఎంతో కష్టపడి రూపొందించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలి, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన కిట్ల తయారీ, పంపిణీపై శాప్ కొన్ని నెలల ముందుగానే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ఓ సంస్థకు ఈ పరికరాలు అందించే టెండర్ను కట్టబెట్టారు. అయితే.. అప్పట్లోనే ఈ సంస్థ పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ శాప్ ఆ కంపెనీకే టెండర్ ఇచ్చేసింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన క్రీడా పరికరాలను మూడు దశల్లో అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే.. తొలి దశలో పంపిణీ చేసిన పరికరాల్లో నాసిరకమైనవి రావడంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గురయ్యారు.
This post was last modified on December 27, 2023 10:26 am
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…