తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2014 నాటి ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం లోని అంశాలను అమలు చేయాలని.. ఆయన కోరారు. ఇచ్చిన హామీలకు పదేళ్లు గడిచిపోతున్నా.. ఎక్కడివక్కడే ఉన్నాయని .. ఇప్పటికైనా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన విన్నవించారు. దాదారు 40 నిమిషాల పాటు సాగిన ప్రధాని మోదీతో బేటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ప్రధానితో భేటీ అనంతరం.. ఆయా వివరాలను భట్టి మీడియాకు వెల్లడించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రయోజనా ల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామ న్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
విభజన చట్టం ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు ఐఐఎం, సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని అడిగామని చెప్పారు. బీఆర్ ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణ కు.. ఆర్థిక సాయం చేయాలని ప్రధానిమంత్రిని విన్నవించినట్టు తెలిపారు.
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…