Political News

టీడీపీ-జ‌న‌సేన పొత్తును కాపు నాయ‌కులు యాక్సెప్ట్ చేయ‌లేక పోతున్నారా?

ఏపీలో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌కుండా చూస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో కాపు నాయ‌కులు ఈ పొత్తు ను అంగీక‌రించ‌లేక పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు అయితే ఖ‌రారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం కూడా ఖాయ‌మై పోయింది. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. సీట్ల పంప‌కాలు మాత్ర‌మే. ఈ ద‌శ‌కు వ‌చ్చేసిన ఈ పొత్తు విష‌యం పై జ‌న‌సేనలో ని కాపు నాయ‌కులు ర‌గిలిపోతున్నారు.

ఇటీవ‌ల ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క జ‌న‌సేన‌ నాయ‌కులు(పెడ‌న‌, గుడివాడ కు చెందిన‌) పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ఉద్దేశించి కాపు సంక్షేమ నాయ‌కుడు, మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ జోగ‌య్య ఘాటు లేఖ రాశారు. మీపైనే ఆశ‌లు పెట్టుకున్న కాపుల‌కు.. మీరు ఏం చెబుతారు? వారి క‌ల‌లు క‌ల్ల‌లు చేస్తారా? అని నిల‌దీశారు. దీనిపై జ‌న‌సేన నుంచి ఇప్ప‌టి వ‌రకు ఎలాంటి రియాక్ష‌న్ రాలేదు. కానీ, జోగ‌య్య లేఖ తాలూకు వేడి మాత్రం కాపుల్లో కొన‌సాగుతోంది.

ఇక‌, ఈ వేడి ఇక్క‌డితో ఆగిపోవ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో మ‌రింత‌గా సెగ త‌గులుతోంది. తాజాగా ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం కీల‌క జ‌న‌సేన నాయ‌కుడు మేడా గురుద‌త్త ప్ర‌సాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ వైసీపీలో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా మేడా మాట్లాడుతూ.. జ‌న‌సేన అధినేత పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కి కాపులని శాశించే అధికారం లేదు, కాపు ఆశయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అని అన్నారు.

అంతేకాదు.. టీడీపీ ప‌ల్ల‌కీని మోయ‌డానికి ప‌వ‌న్‌.. కాపుల‌ను ఎందుకు తాక‌ట్టు పెడుతున్నార‌ని మేడా ప్ర‌శ్నించారు. ప్రతి రాజకీయ నాయకుడు తన పార్టీ, తన నాయకులు ఎదగాలని కోరుకుంటారు. కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం 'పక్క పార్టీ నాయకులు' ఎదగాలని కోరుకుంటున్నారు. రాష్ట్రం బాగు కంటే తనకి ఏ పదవి ముఖ్యం కాదని పదే పదే అంటున్నారు. పదవి అవసరం లేదని ఎవరితో చర్చించి చెప్పారు? నారా లోకేష్, చంద్రబాబు నిర్ణయం సరిపోతుంది అనుకుంటే, నీ వెనకాల నీ పార్టీని నమ్ముకుని తిరిగిన జనసైనికుల పరిస్థితి ఏంటి? నీ వెంట నడిచిన కాపు నాయకుల సంప్రదింపులు నీకు అవసరం లేదా? అని మేడా నిల‌దీశారు.

ఈ ప‌రిణామాల‌తో కాపులు టీడీపీ-జ‌న‌సేన పొత్తును జీర్ణించుకోలేక పోతున్నారా? అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

This post was last modified on December 26, 2023 6:54 pm

Share
Show comments
Published by
Satya
Tags: Kapu

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

11 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

12 hours ago