Political News

ఏపీ ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు డిసైడ్ చేసేది వీళ్లే… !

మ‌హిళ‌లే మ‌హా మంత్రం. వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో వారే కీల‌కంగా మార‌నున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యాలు.. ఆ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టాయి. ముఖ్యంగా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో.. మ‌హిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ప‌డింది. ఇదే ఆ పార్టీకి ప‌దేళ్ల త‌ర్వాత‌.. విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ మ‌హిళ‌లను మ‌చ్చిక చేసుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి.

అయితే.. ఈ క్ర‌మంలో ఎవ‌రు ముందు? ఏ పార్టీ వ్యూహం ఏంటి? అనేది ఇప్పుడు కీల‌కంగా మారింది. వైసీపీ ని తీసుకుంటే.. ఇప్ప‌టికే మ‌హిళ‌ల కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంది. అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న ఇళ్లు వంటివి హైలెట్‌గా నిలుస్తున్నాయి. వీటిని మ‌హిళ‌ల పేరుతోనే అమ‌లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాత్మ‌కంగా మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని అదే అమ్మ ఒడిని ఇంట్లో ఉన్న అంద‌రి పిల్ల‌ల‌కు వ‌ర్తింప జేస్తామ‌ని చెప్పింది.

ఇక‌, ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణాన్ని అమ‌లు చేస్తామ‌ని ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కైనా ప్ర‌యాణం చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని అంటోంది. దీంతో వైసీపీ ఈ రెండు ప‌థ‌కాల‌పైనా దృష్టి పెట్టింది. త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా.. ఈ ప్ర‌భుత్వ హ‌యాంలోనే బ‌స్సుల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి తొలి వారంలో న‌గ‌రాల్లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా.. ప‌దేసి బ‌స్సుల చొప్పున ప్ర‌వేశ పెట్టేందుకు వైసీపీ స‌ర్కారు దృష్టి పెట్టింది.

అంటే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి బ‌స్సులు ప్ర‌వేశ పెట్టి.. సెల్ఫ్ గోల్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప‌థ‌కాలపై మ‌రింత విస్తృత ప్ర‌చారం చేసుకునేందుకు వైసీపీ రంగం రెడీ చేసింది. ప్ర‌తి మ‌హిళ‌నూ వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ రం చేసింది. టీడీపీ కూడా.. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేసేలా.. మ‌రో కీల‌క ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టేం దుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఉద్యోగాల్లో 50 శాతం మహిళ‌ల‌కు కోటా ప్ర‌క‌టించాల‌ని నిర్ణయించింది. మొత్తానికి మ‌హిళ‌ల కేంద్రంగారాజ‌కీయాలు తెర‌వెనుక సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 6, 2024 5:50 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago