మహిళలే మహా మంత్రం. వచ్చే ఏపీ ఎన్నికల్లో వారే కీలకంగా మారనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో.. మహిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్కు అనుకూలంగా పడింది. ఇదే ఆ పార్టీకి పదేళ్ల తర్వాత.. విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ మహిళలను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
అయితే.. ఈ క్రమంలో ఎవరు ముందు? ఏ పార్టీ వ్యూహం ఏంటి? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. వైసీపీ ని తీసుకుంటే.. ఇప్పటికే మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న ఇళ్లు వంటివి హైలెట్గా నిలుస్తున్నాయి. వీటిని మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మకంగా మహిళలను సెంట్రిక్గా చేసుకుని అదే అమ్మ ఒడిని ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు వర్తింప జేస్తామని చెప్పింది.
ఇక, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎక్కడ నుంచి ఎక్కడకైనా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తామని అంటోంది. దీంతో వైసీపీ ఈ రెండు పథకాలపైనా దృష్టి పెట్టింది. త్వరలోనే మహిళలకు ప్రత్యేకంగా.. ఈ ప్రభుత్వ హయాంలోనే బస్సులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరి తొలి వారంలో నగరాల్లో మహిళలకు ప్రత్యేకంగా.. పదేసి బస్సుల చొప్పున ప్రవేశ పెట్టేందుకు వైసీపీ సర్కారు దృష్టి పెట్టింది.
అంటే.. ఎన్నికల సమయానికి బస్సులు ప్రవేశ పెట్టి.. సెల్ఫ్ గోల్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలావుంటే.. మరోవైపు.. మహిళలకు ఇచ్చిన పథకాలపై మరింత విస్తృత ప్రచారం చేసుకునేందుకు వైసీపీ రంగం రెడీ చేసింది. ప్రతి మహిళనూ వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. టీడీపీ కూడా.. మహిళా సాధికారతకు పెద్దపీట వేసేలా.. మరో కీలక పథకాన్ని ప్రవేశ పెట్టేం దుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కోటా ప్రకటించాలని నిర్ణయించింది. మొత్తానికి మహిళల కేంద్రంగారాజకీయాలు తెరవెనుక సాగుతుండడం గమనార్హం.
This post was last modified on January 6, 2024 5:50 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…