టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకునేందుకు ఆయన వ్యూహాలకు పదును పెంచుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల వ్యూహ కర్త.. ప్రశాంత్ కిషోర్ను సంప్రదించడం.. నేరుగా ఆయనను ఉండవల్లికి పిలిపించుకుని చర్చిం చడం వంటిపరిణామాలు ఏపీలో రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
అయితే..చంద్రబాబు పరంగా చూసుకుంటే.. ఈ పరిణామం ప్లస్సా.. మైనస్సా.. అనేది కూడా ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలతోనే వైసీపీ విజయం దక్కించుకున్నదనే చర్చ ఉంది. అయితే.. ఎక్కడో తేడా వచ్చి.. వైసీపీ ఆయనను వదిలించుకుంది. ఈ క్రమంలోనే పీకే కూడా.. తరచుగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ.. నిందలు వేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా టీడీపీ పీకే సేవలను ఆశ్రయించడంపై కొంత ప్లస్గాను, మరికొంత మైనస్గాను చర్చ సాగుతోంది. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు నిండా రెండు పదుల అనుభవం కూడా లేని పీకేను ఆశ్ర యించడాన్ని.. మేధావి వర్గాలు తప్పుపడుతున్నాయి. ఇదేసమయంలో చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలపైకూడా ఎఫెక్ట్ పడే ప్రభావం ఉందని అంటున్నాయి.
మరోవైపు.. పీకేతో చంద్రబాబు భేటీ.. ఆయన సేవల వినియోగంపై టీడీపీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మరింత దూకుడు ప్రదర్శించేందుకు పీకే సాయం అవసరమేనన్నది టీడీపీ నాయకుల మాట. అంతేకాదు, పీకే రాకతో పార్టీ నేతలు కూడా భరోసాగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా పీకే వ్యవహారంపై మిశ్రమ స్పందన లభిస్తుండడం గమనార్హం. మరి ప్రజలేం తేలుస్తారో చూడాలి.
This post was last modified on December 26, 2023 7:05 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…