నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్ వేటు పడిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం టీడీపీలోఉన్నారు. ఇటీవలే ఆయన సతీసమేతంగా పార్టీ కండువా కూడా కప్పుకొన్నారు. అయితే.. ఆయన ఆశిస్తున్నట్టుగా ఉదయగిరి టికెట్ ఆయనకు దక్కేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంపై ఇప్పటికే చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉదయగిరి టికెట్ను వేరేవారికి ఇచ్చేస్తూ.. చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో మేకపాటిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. కడప, నెల్లూరు జిల్లాల్లో టీడీపీని గెలిపించే బాధ్యతను ఆయన అప్పగించారని సమాచారం. తాజాగా ఆయన కడపలోనూ పర్యటించారు. ఇక్కడి టీడీపీ నాయకులతోనూ భేటీ అయ్యారు.
ఇక, నెల్లూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం సర్వేపల్లి, నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి వంటి నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించే బాద్యతను ఆయనకు అప్పగించినట్టు సమాచారం. దీంతో ఆయన వ్యూహ రచన కూడా ప్రారంభించినట్టు చర్చ సాగుతోంది. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మేకపాటికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు టీడీపీ లో అత్యంత కీలకమైన నాయకుడు వెల్లడించారు.
“ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవాలని అధినేత నిర్ణయించుకున్నారు. ప్రస్తుతంసీమలో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించనున్నారు. అది కూడా కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మేకపాటికి బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆయన కోరిక మేరకు రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు” అని ఆ నేత వివరించారు. సో.. దీనిని బట్టి మేకపాటికి కోరిక నెరవేరుతోందనే చర్చ సాగుతోంది.
This post was last modified on December 26, 2023 4:05 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…