ఏపీలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాయకులు అంతర్మథనంలో ఉన్నా రు. తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే బెంగతో ఉన్న నాయకులు పక్క దారులు వెతుక్కుంటున్నా రు. ముఖ్యంగా వైసీపీ నుంచి భారీ సంఖ్యలో ఈ జంపింగులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కదన్న సందేహంతో పలువురు నాయకులు.. పొరుగు పార్టీలతోనూ చర్చలు చేస్తున్నట్టు సమాచారం.
పిఠాపురం, గుంటూరు పశ్చిమ(టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన), మడకశిర వంటి నియోజకవర్గాల్లో ఎమ్మె ల్యేలు.. పొరుగు పార్టీలపై దృష్టి పెట్టారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హైదరాబాద్లోనే మకాం వేసి.. ఓ కీలక పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూడా .. తిరిగి పీచే ముడ్ అన్నట్టుగా సొంత పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇలా.. చాలా మంది నాయకులు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే, ఇలాంటి వారి విషయంలో వైసీపీ ఎక్కడా బుజ్జగింపు రాజకీయాలకు తెరదీయలేదు. అంతేకాదు.. కనీసం వారితో చర్చించేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికే వచ్చిన అనేక సర్వేలు.. ముఖ్యంగా ఐప్యాక్ టీం ఇచ్చిన సర్వే రిజల్ట్తో వీరిని పక్కన పెట్టినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ఇదే సర్వే ఫలితాలను ఇతర పార్టీలు కూడా విశ్వసిస్తున్నాయనే వాదన ఉంది.
“ఎక్కడైనా గెలిచే నాయకులే అవసరం. మాకు మాత్రం ఓడిపోయే నాయకులు ఎందుకు?” అని టీడీపీ సహా.. జనసేనలోనూ చర్చ సాగుతోంది. అయితే.. వైసీపీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకోవాలనే భావన ఉన్నప్పటికీ.. టికెట్ల కేటాయింపు మాత్రం లేకపోయే అవకాశమే మెండుగా ఉందని అంటున్నారు. ఆయా పార్టీల్లోనే నాయకులు లెక్కకు మించి ఉండడంతోపాటు.. పోటీ కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైసీపీ వద్దని ముద్ర వేసిన నాయకులను తిరిగి పోటీ చేయించడంపై పార్టీలు ఒక స్పష్టతతో ఉన్నాయి. ఈ క్రమంలోనే జంపింగులకు.. పార్టీలు మారడం బాగానే ఉన్నా.. కోరికలు తీరడంమాత్రం కష్టమనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on December 26, 2023 9:39 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…