వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు వచ్చే ఎన్నికల్లో టికెట్దక్కుతుందా? లేక ఆయన స్థానంలో వేరే వారి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మొదట ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలు ప్రారంభంచిన వెలంపల్లి 2009లో తొలిసారే విజయం దక్కించుకున్నారు. తర్వాత.. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో బీజేపీ బాట పట్టారు.
ఈ క్రమంలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019కి ముందు వైసీపీలోకి వచ్చిన వెలంపల్లి.. ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు.. వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిని కూడా సొంతం చేసుకున్నారు. రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో ఆయనను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. మరోసారి ఆయన పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా.. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కేడర్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే వెలంపల్లికి ఆరంభం నుంచి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉందనే ప్రచారం ఉంది. ప్రధానంగా కొందరు కార్పొరేటర్లు వెలంపల్లి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం తన వర్గం(వైశ్య వర్గా నికి చెందిన బడా వ్యాపారులు) వాళ్లనే ఎమ్మెల్యే ప్రోత్సహిస్తూ అన్ని పనులు చేయించుకుంటున్నా రనే ది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. పైగా తనను ప్రశ్నించిన వారు ఎవరైనా సరే పోలీసు కేసులు పెట్టిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వెలంపల్లి పోటీ చేసినా ఓడిస్తామనే గళాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ టికెట్ను వేరేవారికి ఇస్తారని, అది కూడా మైనారిటీ ముస్లిం వర్గానికే కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో నిమ్రా విద్యా సంస్థల అధినేత రసూల్ఖాన్ పేరు వినిపిస్తుండడం గమనార్హం.
అంతేకాదు.. స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో రసూల్ ఖాన్ పేరుతో బ్యానర్లు వెలియడం మరింతగా రాజకీయ కాక పుట్టిస్తోంది. దీంతో వెలంపల్లికి టికెట్ టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడం గమనార్హం. ఇక్కడ కలిసి వస్తున్న పరిణామం ఏంటంటే.. సీఎం జగన్కు వెలంపల్లి ఆప్తుడు కావడమే!!
This post was last modified on December 26, 2023 10:02 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…