తెలంగాణలో ప్రభుత్వం మారింది. తమనే గెలిపిస్తారని.. తాము చేసిన అబివృద్ధి దేశంలో ఎక్కడా ఎవరూ చేయడం లేదని.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. పదే పదే చెప్పుకొన్న కేసీఆర్ను ప్రజలు పక్కన పెట్టేశారు. ఎన్నో సెంటిమెంట్లు ప్లే చేసినా.. వాటిని కూడా ప్రజలు పట్టించుకో లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండు అంశాలను కీలకంగా తీసుకున్న కేసీఆర్.. అవైనా తమను గట్టెక్కిస్తాయని అనుకున్నారు. అయితే.. అవి కూడా ఫలించలేదు.
అవే.. ఒకటి సర్వేలు. రెండు సొంత మీడియా. సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికలకు ఆరు మాసాల నుంచి అనేక సర్వేలు చేయించారు కేసీఆర్. తను సొంతగా చేయించుకున్న సర్వేతోపాటు.. ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా.. ఆయన అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరు.. పథకాల జోరు.. ప్రజల నాడిని పట్టుకునేందుకు .. కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతేకాదు.. ఇంటిలిజెన్సును కూడా గ్రామ గ్రామానా తిప్పారు. అయితే.. సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగానే వచ్చాయి.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ .. ఇదే సర్వేలు వచ్చాయి. దీంతో కాదని అన్న స్థానాల్లోనూ సిట్టింగులకే సీట్లు ఇచ్చారు. తీరా ఫలితం రివర్స్ అయింది. మరోవైపు.. కేసీఆర్కు సొంత మీడియా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(ఇంగ్లీష్) పత్రికలతోపాటు.. టీ న్యూస్ చానల్ కూడా ఉంది. ఈ మీడియా ద్వారా.. నిరంతరం.. కేసీఆర్పై కథనాలు ప్రచారం చేశారు. అభివృద్ధిని వివరించారు. ఇక, సెంటిమెంటుకు హద్దు అదుపు లేకుండా చేశారు. అయినా.. ప్రజలు వీటిని పట్టించుకోలేదు.
కట్ చేస్తే.. ఏపీలోనూ ప్రధాన పార్టీలు మీడియా, సర్వేలనే నమ్ముతున్నాయి. పైకి.. ఏమీ తెలియనట్టుగా ఉన్నా.. టీడీపీ, వైసీపీలు సర్వేలు చేయిస్తున్నాయి.. అనుకూల మీడియాలను కూడా నమ్ముకున్నాయి. మరి వీటి ప్రకారం మార్పులు చేర్పులు చేస్తారా? లేదా.. ఏం చేస్తారనేది చూడాలి. కానీ, తెలంగాణలో వచ్చిన ఫలితాన్ని చూస్తే.. సర్వేలు.. మీడియా పార్టీలను కాపాడతాయా? లేదా? అనేది వెయిట్ చేయాల్సిందే.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…