తెలంగాణలో ప్రభుత్వం మారింది. తమనే గెలిపిస్తారని.. తాము చేసిన అబివృద్ధి దేశంలో ఎక్కడా ఎవరూ చేయడం లేదని.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. పదే పదే చెప్పుకొన్న కేసీఆర్ను ప్రజలు పక్కన పెట్టేశారు. ఎన్నో సెంటిమెంట్లు ప్లే చేసినా.. వాటిని కూడా ప్రజలు పట్టించుకో లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండు అంశాలను కీలకంగా తీసుకున్న కేసీఆర్.. అవైనా తమను గట్టెక్కిస్తాయని అనుకున్నారు. అయితే.. అవి కూడా ఫలించలేదు.
అవే.. ఒకటి సర్వేలు. రెండు సొంత మీడియా. సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికలకు ఆరు మాసాల నుంచి అనేక సర్వేలు చేయించారు కేసీఆర్. తను సొంతగా చేయించుకున్న సర్వేతోపాటు.. ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా.. ఆయన అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరు.. పథకాల జోరు.. ప్రజల నాడిని పట్టుకునేందుకు .. కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతేకాదు.. ఇంటిలిజెన్సును కూడా గ్రామ గ్రామానా తిప్పారు. అయితే.. సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగానే వచ్చాయి.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ .. ఇదే సర్వేలు వచ్చాయి. దీంతో కాదని అన్న స్థానాల్లోనూ సిట్టింగులకే సీట్లు ఇచ్చారు. తీరా ఫలితం రివర్స్ అయింది. మరోవైపు.. కేసీఆర్కు సొంత మీడియా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(ఇంగ్లీష్) పత్రికలతోపాటు.. టీ న్యూస్ చానల్ కూడా ఉంది. ఈ మీడియా ద్వారా.. నిరంతరం.. కేసీఆర్పై కథనాలు ప్రచారం చేశారు. అభివృద్ధిని వివరించారు. ఇక, సెంటిమెంటుకు హద్దు అదుపు లేకుండా చేశారు. అయినా.. ప్రజలు వీటిని పట్టించుకోలేదు.
కట్ చేస్తే.. ఏపీలోనూ ప్రధాన పార్టీలు మీడియా, సర్వేలనే నమ్ముతున్నాయి. పైకి.. ఏమీ తెలియనట్టుగా ఉన్నా.. టీడీపీ, వైసీపీలు సర్వేలు చేయిస్తున్నాయి.. అనుకూల మీడియాలను కూడా నమ్ముకున్నాయి. మరి వీటి ప్రకారం మార్పులు చేర్పులు చేస్తారా? లేదా.. ఏం చేస్తారనేది చూడాలి. కానీ, తెలంగాణలో వచ్చిన ఫలితాన్ని చూస్తే.. సర్వేలు.. మీడియా పార్టీలను కాపాడతాయా? లేదా? అనేది వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on December 26, 2023 9:45 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…