కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న చాలా మంది నాయకులకు ఇప్పటికే మంత్రి పదవులు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి..ఇప్పుడు మరో కీలక నిర్నయం తీసుకున్నారు. మంత్రుల్లో పది మందిని ఎంపిక చేసి.. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్లుగా నియమించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడుదల చేశారు. కాగా, ఆయా జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత దూకుడుగా అందించడంతోపాటు.. పార్టీ పరంగానూ.. మంత్రులు చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించేందుకు, వివాదాలు రాకుండా చూసుకునేందుకు కూడా వీరిపైనే బాధ్యత ఉండనుంది.
జిల్లాలు – మంత్రులు
హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్.
ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
వరంగల్- పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.
నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు.
రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్బాబు.
కరీంనగర్ – ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి.
మహబూబ్నగర్ – దామోదర రాజనర్సింహ.
మెదక్ – కొండా సురేఖ.
ఆదిలాబాద్ – సీతక్క.
నిజామాబాద్- జూపల్లి కృష్ణారావు.
This post was last modified on December 26, 2023 9:36 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…