Political News

ప్ర‌పంచాన్ని ఉజ్జ‌యిని కాలమానం చుట్టూ తిప్పుతా

దేశంలో మోడీ ప్ర‌భుత్వం బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల‌ను.. అప్ప‌టి శాస‌నాల‌ను మారుస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే.. ఐపీసీ.. సీఆర్ పీసీ.. వంటి కీల‌క‌మైన మూడు చ‌ట్టాల‌ను పూర్తి గా మార్చేసి.. భార‌తీయ‌త‌ను జోడిస్తూ.. భార‌తీయ న్యాయ‌సంహిత, భార‌తీయ సాక్ష్య అధినియం వంటి చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చింది.(వీటిని పార్ల‌మెంటు ఆమోదించింది. రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలపాల్సి ఉంది) ఇక‌, ఇప్పుడు ప్ర‌పంచ కాల‌మానాన్ని మార్చే ప‌నిపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి తాజాగా బీజేపీ ఇటీవ‌ల మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మోహ‌న్ యాద‌వ్ అసెంబ్లీ వేదిక‌గానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచాన్ని ఉజ్జ‌యిని కాలమానం చుట్టూ తిప్పుతా! అని సీఎం మోహ‌న్ యాద‌వ్ తాజాగా వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుత కాల మానం ఇదీ..

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం ‘గ్రీన్‌విచ్‌’ కాల‌మానాన్ని అనుస‌రిస్తోంది. దీనిని బ‌ట్టే ప్ర‌పంచ దేశాలు స‌మ‌యాన్ని నిర్ణ‌యించుకున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ విచ్ అనేది బ్రిట‌న్ దేశంలోని పారిస్‌లో ఉన్న ప్రాంతం. కాలాన్ని నిర్దేశిస్తున్న ‘ప్రైమ్ మెరిడియన్’ గ్రీన్‌విచ్ గుండా వెళ్తుందని 1884లోనే ప్రతిపాదించారు.

దీంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ విధానాన్నే అనుసరిస్తోంది. ప్రపంచ కాలానికి ‘0’ డిగ్రీల రేఖాంశం అత్యంత ముఖ్యమైనది. దీనినే ‘ప్రైమ్ మెరిడియన్’ అని పిలుస్తుంటారు. ఈ రేఖాంశం నుంచి భూమిని నిలువుగా రెండు వైపుల సమానంగా విభజిస్తున్నారు. ఈ రేఖాంశం ఇంగ్లాండ్‌లోని గ్రీన్‌విచ్ అనే ప్రాంతం గుండా వెళ్తుంది. దీంతో ప్రస్తుతం ఈ విధానాన్నే కాలానికి ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు.

సీఎం వ్యాఖ్య‌లు ఇవీ..

ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం మోహ‌న్ యాద‌వ్‌ తెలిపారు. “నిజానికి ప్రైమ్ మెరిడియన్ ఉజ్జయిని నుంచి వెళ్తోంది. కాబట్టి ఉజ్జయిని ప్రపంచ ప్రైమ్ మెడియన్‌. దీనిని అనుస‌రించి నేను ప్రపంచ కాలాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తా. ఉజ్జ‌యిని చుట్టూ ప్ర‌పంచ కాలగ‌మ‌నాన్ని నిర్దేశిస్తా” అని అసెంబ్లీలోనే మోహన్ యాదవ్ ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. 300 ఏళ్ల క్రితమే ప్రపంచ ప్రామాణిక సమయాన్ని భారతదేశం నిర్ణయించిందని సీఎం మోహ‌న్ యాద‌వ్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో సమయాన్ని నిర్ధారించే పరికరం ఇప్పటికీ ఉందన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజు ప్రారంభం కావడాన్ని ఆయన త‌ప్పు ప‌ట్టారు. సూర్యోదయం లేదా కొంత సమయం తర్వాతే ప్రజలు మేల్కొంటారని, దానిని బ‌ట్టి రోజు మార‌డం అక్క‌డే మొద‌లు కావాల‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on December 26, 2023 9:29 am

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

1 hour ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

15 hours ago