కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇడుపులపాయలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా అన్నాచెల్లెళ్లు విడివిడిగానే నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా షర్మిల చేసిన పనితో ఆ విభేదాలు మరింత ముదిరాయని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిన వైనం సంచలనం రేపుతోంది.
జగన్ కు తనకు తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి అన్న విషయాన్ని కన్ఫమ్ చేసేలాగా షర్మిల చేసిన తాజా పని రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆ గిఫ్ట్ లు స్వీకరించిన లోకేష్ దాని ఫోటో ట్విటర్ లో షేర్ చేసి షర్మిలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నారా కుటుంబ సభ్యులు తరఫున షర్మిలకు లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు ఆయన సోదరి షర్మిల గిఫ్టులు పంపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. దాంతోపాటు త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల యాక్టివ్ కాబోతున్నారన్న ప్రచారం కూడా వైసీపీ నేతలను ఇరుకున పెడుతుంది.
అన్నయ్య జగన్ కు కనీసం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పని షర్మిల…ఆయన ప్రత్యర్థి లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపడం జగన్ ను ఘోరంగా అవమానించినట్లేనని, వారిద్దరి మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్టుగా ఈ విషయం రుజువు చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి, లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ వ్యవహారంపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్న ఆసక్తి ఏర్పడింది.
This post was last modified on December 25, 2023 9:02 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…