Political News

ఎంపీ రేసు.. ఈటల ఇక్కడ, చీకోటి అక్కడ?

లోక్ సభ ఎన్నికలు మరోసారి తెలంగాణలో పొలిటికల్ వార్ కు తెరలేపుతున్నాయి. ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో బరిలో దించే అభ్యర్థులపై ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో సీట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత కీలకమైన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈటల ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. కానీ ఈ స్థానం కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు, పేరాల చంద్రశేఖర్, వీరేందర్ గౌడ్, సామరంగారెడ్డి, రామచందర్ రావు, ఆకుల రాజేందర్, మల్లారెడ్డి తదితర నేతలు టికెట్ ప్రయత్నాల్లో పడ్డారు.

మరోవైపు క్యాసినో కింగ్ గా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్ కూడా ఎంపీగా పోటీ చేసేందుకు తనదైన ప్రయత్నాల్లో మునిగిపోయారని టాక్. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇంట్రస్ట్ తో చీకోటి ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి బరిలో దిగేందుకు మాజీ ఎంపీ బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్ తదితరులు పోటీపడుతున్నారు. సామజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ఈటల రాజేందర్ నూ ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి తిరిగి మెదక్ ఎంపీ గా పోటీ చేసే ఆస్కారముంది. గతంలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమెను.. మరోసారి అక్కడే బరిలో దింపాలని కాంగ్రెస్ చూస్తుందని తెలిసింది. విజయశాంతి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ అనుకుంటోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దూసుకెళ్తోంది. ఓటమి పాలైన బీఆర్ఎస్ అందుకు గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది. ఇక గతంలో కంటే అధికంగా సీట్లు దక్కించుకున్న బీజేపీ భవిష్యత్ పై ఆశతో ఉంది. ఇక ఇప్పుడు అన్ని పార్టీల కన్ను మరో మూణ్నాలుగు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. తెలంగాణలోనూ మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలనే ధ్యేయంతో ఉంది.

This post was last modified on December 26, 2023 10:07 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆ ప‌ద‌వుల కోసం.. త‌మ్ముళ్ల క్యూ.. !

టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఐదేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేసిన వారు.. నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.…

1 hour ago

టీడీపీ కుటుంబాల్లో ఈ కుటుంబం వెరీ వెరీ స్పెష‌ల్‌..!

తెలుగు దేశం పార్టీలో కొన్నిద‌శాబ్దాలుగా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల, రాజ‌మండ్రికి చెందిన బుచ్చ‌య్య‌,…

2 hours ago

బాబుది ఎడ్యుకేటెడ్ కేబినెట్

24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు…

7 hours ago

పవన్ కు ఇష్టమైన పనే అప్పగించిన బాబు

ఏపీ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. గ్రామీణ…

9 hours ago

‘నామా’కు టీడీపీ ప‌గ్గాలు?

తెలంగాణలో టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈ విష‌యంపైనా దృష్టి పెట్టారు. త్వ‌ర‌లోనే…

9 hours ago

ఇద్దరు ప్రియులతో సహజీవనం, తండ్రికి తెలియడంతో హత్య

తల్లిని కోల్పోయిన బిడ్డ పెడదారి పడుతుందని తెలుసుకున్న ఆమెకు పెళ్లి చేస్తే దారిలో పడుతుందని ఆశించాడు. ఆమెకు పెళ్లి కుదిర్చి…

10 hours ago