ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా? ఇక ఏపీలో పార్టీ ఆపరేషన్ మొదలెట్టేందుకు సిద్ధమైందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోసం ప్రణాళికాబద్ధంగా సాగిన కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఫోకస్ ను పక్కనే ఉన్న ఏపీపైకి షిప్ట్ చేసింది. మరో మూణ్నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందుకే ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా మాణిక్యం ఠాగూర్ కు కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పింది.
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాణిక్యం ఠాగూర్ కీలక పాత్ర పోషించారు. రేవంత్ తో కలిసి పార్టీని గెలిపించుకున్నారు. దీంతో మాణిక్యం పేరు మార్మోగింది. ఇప్పుడు ఆయన సామర్థ్యాలను నమ్మి ఏపీలో పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతను హైకమాండ్ అప్పగించింది. మరోవైపు వైఎస్ షర్మిలను అన్న జగన్ పైకి ప్రయోగించాలని కాంగ్రెస్ అనుకుంటోందని తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో తన పార్టీ వైఎస్సార్ టీపీని విలీనం చేయడం కోసం షర్మిల తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ఎన్నికలు ముగిసేంతవరకూ కాంగ్రెస్ వేచి చూడాలని పేర్కొంది. అందుకే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు షర్మిల మద్దతునిచ్చారు.
ఇక ఇప్పుడు తెలంగాణలో షర్మిలతో కాంగ్రెస్ కు అవసరం లేదు. మరోవైపు షర్మిలకు కూడా తెలంగాణలో పెద్దగా ఆదరణ లేదు. అందుకే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని, ఏపీలో షర్మిలను యాక్టివ్ గా మార్చాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ బహుమతి పంపడం కూడా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో బాబును చేర్చుకునేందుకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో బాబు చేరే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బాబు, షర్మిలతో కలిసి జగన్ కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యవహరించే అవకాశముంది.
This post was last modified on December 25, 2023 5:35 pm
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…