బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓటమి గురించి.. ఆయన తాజాగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని రెండు వర్గాలు బీఆర్ ఎస్కు దూరమయ్యాయని, ఇదే తమకు ఎన్నికల్లో ఓటమికి కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ రెండు వర్గాలే..ఉద్యోగులు, నిరుద్యోగులు అని కేటీఆర్ చెప్పారు. వాస్తవానికి బీఆర్ ఎస్ పాలన.. ఉపాధి అవకాశాలకు గనిగా మారింది. అనేక ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. అయితే.. దీనిని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోలేక పోయాం
అని కేటీఆర్ అన్నారు.
ఇక, ఉద్యోగుల గురించి మాట్లాడూతూ.. దేశంలో భారీగా వేతనాలు పెంచిన సర్కారు ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచామన్నారు. పీఆర్సీని కూడా ప్రకటించామని, ఎన్నికల సంఘంతో చర్చించి ఎన్నికలకు ముందు డీఏ బకాయిలు కూడా విడుదల చేశామని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ.. ఉద్యోగుల విషయంలో మేం ప్రచారం చేసుకోలేక పోయామని కేటీఆర్ వెల్లడించారు. ఈ రెండు వర్గాలు అందుకే తమకు దూరమయ్యాయని ఆయన ఒప్పుకొన్నారు.
అయితే.. భవిష్యత్తులో తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటామని, సరిచేసుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎదురైన ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. తాజాగా రేవంత్ సర్కారు విడుదల చేసిన శ్వేత పత్రానికి దీటుగా తమ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంపద పెంపును వివరిస్తూ.. కేటీఆర్ స్వేద పత్రం పేరుతో గత పదేళ్ల పాలనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ఓటమికి గల కారణాలపై క్తుప్తంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులు దెబ్బేసేశారని వ్యాఖ్యానించారు.
This post was last modified on December 25, 2023 4:11 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…