2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ.. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. అటు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇటు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగించింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ జిల్లాల్లో తన ఆధిపత్యాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా? అనేది చర్చనీయంశంగా మారింది. ఎందుకంటే.. ఈ మూడు జిల్లాల్లోనూ మునుపటికిఇప్పటికి పరిస్థితి మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
నెల్లూరు: 2019లో ఉన్న ఐక్యత ఇప్పుడు వైసీపీలో లేదు. పైగా.. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయ ణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వంటివారు పార్టీ మారిపోయి… బయటకువచ్చేశారు. ఇక, ఫైర్ బ్రాండ్ గా ఉన్న నాయకులుకూడా.. మౌనంగా ఉన్నారు. జిల్లాల స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతు న్నాయి. మరోవైపు.. టీడీపీకి మరింత బలం పెరిగింది సో.. మొత్తంగా చూసుకుంటే నెల్లూరులో క్లీన్ స్వీప్చేయడం అంత తేలిక అయితేకాదని పరిశీలకులు చెబుతున్నారు.
కడప: ఇది సీఎం జగన్ సొంత జిల్లా. 2019లో 10 అసెంబ్లీ స్థానాలు.. సహా పార్లమెంటు స్థానాల్లోనూ విజ యం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో రాజంపేట, కడప, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో గెలుపు కష్టమని అంటున్నారు. జిల్లాల విభజనతో ఇక్కడ వైసీపీలో పుట్టిన సెగలు ఇంకా కొనసాగుతు న్నాయి. మరోవైపు.. వైఎస్ వివేకా హత్యతోపాటు టీడీపీ నేత బీటెక్ రవిపైకేసులు.. వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయి.
కర్నూలు: ఈ జిల్లాలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం కష్టమనే భావన ఉంది. టీడీపీ ఇప్పుడు ఇక్కడ బలంగా ముందుకు సాగుతుండడంతోపాటు.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. న్యాయ రాజధాని అని పేర్కొన్నా ఎలాంటి అభివృద్ధి లేక పోవడంతో కర్నూలు ఓటర్లు ఈ దఫా గుండుగుత్తగా వైసీపీకి మద్దతు పలుకుతారనే విషయంలో సందేహాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 25, 2023 1:16 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…