ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలన్నా ప్రణాళిక లేదు.. పార్టీ పుంజుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన లేదు.. కానీ ఎన్నికల్లో మాత్రం కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ మాత్రం చేస్తున్నారు. ఇదీ కొంతమంది టీడీపీ నేతల తీరుగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. కుటుంబంలో ఒక్కరికి టికెట్ ఇస్తే సరిపోదని ఈ నాయకులు తెగేసి మరీ చెబుతున్నారని తెలిసింది. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చేలా బాబు ఉన్నారని తెలిసింది. అయితే ఈ ఎంపీ సీటుతో పాటు తన తనయుడికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కళా వెంకటరావు కోరుతున్నారని సమాచారం.
ఇక మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా రెండు టికెట్ల కోసం పట్టుబడుతున్నారని టాక్. విజయనగరంలో తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏది ఇచ్చినా ఓకే కానీ తన తనయకు కూడా ఓ సీటు ఇవ్వాలన్నది అశోక్ డిమాండ్ గా తెలుస్తోంది. మరోవైపు విశాఖ జిల్లాలో వచ్చే ఏడాది ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమైందనే చెప్పాలి. ఈ సీటు తనకు దక్కిందనే ఆనందం కంటే కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ తన కొడుకు విజయ్ పాత్రుడికి వస్తుందో లేదోననే ఆందోళనే అయ్యన్నపాత్రుడికి ఉందని చెబుతున్నారు.
మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తదితర నాయకులు తమ వారసులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. పార్టీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న తమ సీనియారిటీని గుర్తించి టికెట్లు ఇవ్వాలని బాబును కోరుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాల వేటలో ఉన్న బాబు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on December 24, 2023 11:23 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…