ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యే. ముందు అంతా ఫీల్ గుడ్. పార్టీ మారే వరకు అందరూ ఆహా.. ఓహో అన్నవారే. కానీ, రోజులు గడిచి ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వారే.. ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సహకరించేందుకు మొహం చాటేస్తున్నారు. ఆయనే విశాఖపట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గం నుంచి 2019లో టీడీపీ టికెట్పై గెలిచిన వాసుపల్లి గణేష్. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. తన కుమారుడితో సహా 2021లో పార్టీ నుంచి జంప్ చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్పై ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆయనకు ఏమాత్రం అనుకూలంగా లేవనేది స్పష్టంగా తెలుస్తోంది. వాసుపల్లిని లక్ష్యంగా చేసుకొని సొంత సామాజికవర్గంతో పాటు పార్టీ వార్డు స్థాయి నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. వాసుపల్లికి మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు పంపిస్తున్నారు. అదేసమయంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్తో వాసుపల్లికి పొసగడం లేదు. తన సామాజిక వర్గానికి చెందిన వారెవరికీ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ రాకుండా వాసుపల్లి అడ్డుపడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు.
పార్టీ మారినా.. వైసీపీలో అసమ్మతి సెగతో వాసుపల్లి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరు ఎటువైపో తెలియని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున దక్షిణం నియోజకవర్గం నుంచి మరొక అభ్యర్థి పేరు అధిష్ఠానం పరిశీలనలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలన్న క్షేత్రస్థాయిలో డిమాండ్ను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. అంతేకాదు.. పార్టీకి అండగా నిలిచే మత్స్యకార సామాజిక వర్గం కూడా వాసుపల్లిని కోరుకోవడం లేదన్నది క్షేత్రస్థాయిలో నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వాసుపల్లి పరిస్థితి ఇబ్బందిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 24, 2023 11:09 pm
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన ఒకే ఒక్క ఆలోచన.. 5…
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…
‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…